Gachibowli Road Accident Yesterday: YouTuber Gayatri Died In Accident - Sakshi
Sakshi News home page

Dolly D Cruze aka Gayathri: యూట్యూబర్‌ గాయత్రి మృతి.. ప్రమాదానికి ముందేం జరిగింది?

Published Sat, Mar 19 2022 12:28 PM

Junior Artist Ganyatri, Another Woman Killed Gachibowli Road Accident Latest Updates - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గచ్చిబౌలి రోడ్డు ప్రమాదం కేసులో దర్యాప్తు కొనసాగుతోందని మాదాపూర్‌ డీసీపీ శిల్పవల్లి తెలిపారు. హోలీ సందర్భంగా జూనియర్‌ ఆర్టిస్ట్‌ గాయత్రి తన స్నేహితుడు రోహిత్‌తో కలిసి ప్రిసమ్‌ పబ్‌కు వెళ్లినట్లు తెలిసిందని పేర్కొన్నారు. అయితే ప్రీసమ్‌ పబ్‌లోకి వెళ్లి పార్టిసిపేట్ చేశారా లేదా అన్నది క్లారిటీ లేదని తెలిపారు. గచ్చిబౌలి ఏఐజీ అసుపత్రిలో వెంటిలేటర్‌పై రోహిత్‌ చికిత్స పొందుతున్నాడని తెలిపారు.  అతి వేగంగా కారు నడపడం వల్లే ప్రమాదానికి కారణామని తమ ప్రాథమిక విచారణలో తెలిసినట్లు పేర్కొన్నారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

కాగా గచ్చిబౌలి ఐటీ కారిడార్‌లో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతిచెందిన విషయం తెలిసిందే. అతివేగంగా వచ్చిన వీరి కారు ఎల్లా హోటల్‌ ముందు ఫుట్‌పాత్‌ను ఢీ కొట్టి గాల్లోకి ఎగిరిపడింది. ఈ ప్రమాదంలో ఆ దగ్గర్లోనే గార్డెనింగ్‌ పనులు చేస్తున్న మహేశ్వరి(38)ని ఢీకొట్టడంతో ఆమె  అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన రోహిత్, జూనియర్‌ ఆర్టిస్ట్‌, యూట్యూబర్‌ గాయత్రిని గచ్చిబౌలిలోని ఏఐ జీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే గాయత్రి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

ఫుట్‌పాత్‌ను కారు ఢీ కొట్టడంతో రెండు చక్రాలు ఊడిపడ్డాయి. కారు పల్టీ కొట్టగానే అందులోంచి గాయత్రి బయట పడిపోయినట్లుగా సీసీ పుటేజీలో పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే గత కొన్నాళ్లుగా గాయత్రి, రోహిత్‌ మధ్య స్నేహం నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే శుక్రవారం హోలీ పండగ సందర్భంగా గాయత్రి ఇంటికి వెళ్లిన రోహిత్‌ తనను పికప్‌ చేసుకున్నాడు. తరువాత ఇద్దరు కలిసి ప్రిసమ్‌ పబ్‌లో పార్టీ చేసుకున్నారు. పార్టీ అనంతరం ఇద్దరూ ఇంటికి బయలుదేరగా ప్రమాదం జరిగింది. గాయత్రి కారును డ్రైవ్‌ చేయగా, అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. రోహిత్‌ కూకట్‌పల్లిలోని హెచ్‌ఎంటీ హిల్స్‌లో నివాసం ఉంటున్నారు.
చదవండి: ఇంటి నుంచి బయటికి వెళ్లిన యువతి అదృశ్యం

మరోవైపు రోడ్డు ప్రమాదంపై గాయత్రి తల్లి స్పందించారు. తన కూతుకు అన్యాయం చేసి వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం రోహిత్‌తో కలిసి కూతురు బయటకు వెళ్లిందని తెలిపారు. న్యాయ వ్యవస్థ, పోలీసులు తమకు న్యాయం చేయాలని కోరారు.

Advertisement
Advertisement