ఆన్‌లైన్‌లో కరెంటు బిల్లు కట్టాలని..  | Cyber criminals cheated women electricity bill online at Bangalore | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లో కరెంటు బిల్లు కట్టాలని.. 

Jul 11 2022 3:39 AM | Updated on Jul 11 2022 3:39 AM

Cyber criminals cheated women electricity bill online at Bangalore - Sakshi

బనశంకరి (బెంగళూరు): ఆన్‌లైన్లో కరెంటు బిల్లు చెల్లించాలని సైబర్‌ నేరగాళ్లు ఓ మహిళ అకౌంట్‌ నుంచి రూ.10.76 లక్షలు కాజేశారు. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 7వ తేదీన బెంగళూరులోని కుమారస్వామి లేఔట్‌ నివాసి డాక్టర్‌ వాణి ప్రభాకర్‌  మొబైల్‌ ఫోన్‌కు కరెంటు బిల్లు చెల్లించాలని, లేదంటే కనెక్షన్‌ కట్‌ అవుతుందని గుర్తుతెలియని వ్యక్తి నుంచి  మెసేజ్‌ వచ్చింది.

మెసేజ్‌ వచ్చిన నంబర్‌కు ఆమె ఫోన్‌ చేసి విచారించగా.. టీం వ్యూయర్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని చెప్పగా, ఆమె ఇన్‌స్టాల్‌ చేసింది. మోసగాళ్లు సూచించిన ఖాతాకు రూ.100 చెల్లించింది. కొద్దిసేపటి తరువాత ఆమె బ్యాంకు ఖాతా నుంచి రూ.10.76 లక్షల నగదు వేరే అకౌంట్‌కు జమ అయినట్లు మెసేజ్‌ వచ్చింది. వెంటనే బ్యాంకుకు వెళ్లి విచారించగా డబ్బుపోవడం నిజమేనని తేలింది. దీంతో బాధితురాలు సైబర్‌క్రైం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement