చార్టర్డ్‌ అకౌంటెంట్‌ సింధు అనుమానాస్పద మృతి | Chartered Accountant Sindhu Suspicious Deceased In Vijayawada | Sakshi
Sakshi News home page

చార్టర్డ్‌ అకౌంటెంట్‌ సింధు అనుమానాస్పద మృతి

Aug 21 2021 8:25 PM | Updated on Aug 21 2021 8:57 PM

Chartered Accountant Sindhu Suspicious Deceased In Vijayawada - Sakshi

( ఫైల్‌ ఫోటో )

సాక్షి, విజ‌య‌వాడ‌: కృష్ణా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ యువ చార్టెడ్ అకౌంటెంట్ అనుమానాస్ప‌ద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటన మాచ‌వ‌రం పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో జరిగింది. మృతి చెందిన చెరుకూరి సింధు కొద్ది రోజులుగా ప్రసేన్‌ అనే వ్యక్తితో సన్నిహితంగా ఉంటున్నారు. ఆ వ్యక్తి ఇంట్లోనే సింధు ఉరి వేసుకొని కనిపించారు. అదీ కాకుండా సింధు ముఖంగాపై గాయాలు కనిపించడంతో.. తమ కూతురిది ఆత్మహత్య కాదని ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

సింధుతో సన్నిహితంగా ఉంటున్న ప్రసేన్‌ కుమార్‌ తమ కుమార్తెను హత్య చేశాడని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు ప్రేమ వ్యవహారం కారణమని సమాచారం. అయితే సింధు,ప్రసేన్‌ల ప్రేమ వివాహానికి పెద్దలు అంగీకరించలేదని తెలుస్తోంది. దీంతో లాక్‌డౌన్‌ అనంతరం సింధు.. ప్రసేన్‌ ఇంట్లోనే ఉంటునట్లు సమాచారం. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement