రెండు కార్లు ఢీ...మృత్యువులోనూ వీడని బంధం | Brother And Sister Died In Car Accident At Belagavi | Sakshi
Sakshi News home page

రెండు కార్లు ఢీ...మృత్యువులోనూ వీడని బంధం

Dec 9 2022 9:52 AM | Updated on Dec 9 2022 10:52 AM

Brother And Sister Died In Car Accident At Belagavi - Sakshi

దొడ్డబళ్లాపురం: మృత్యువులోనూ అన్నాచెల్లెళ్ల బంధం వీడలేదు. బెళగావి జిల్లా మూడలగి తాలూకా గుర్లాపుర వద్ద రెండు కార్లు ఢీకొన్న ప్రమాదంలో అన్నాచెల్లెలు మృతి చెందారు. గురువారం రాయబాగ తాలూకా కప్పలగుద్ది గ్రామానికి చెందిన అడివెప్ప బడిగేర (34), చెల్లెలు భాగ్యశ్రీ (22) కారులో వెళ్తుండగా ముధోళ–నిప్పాణి రాష్ట్ర రహదారిలో మరో కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది.

అడివెప్ప, భాగ్యశ్రీలు తీవ్ర గాయాలతో మరణించగా, మరో కారులో ఉన్న ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను గోకాక్‌లోని ఉమారాణి ఆస్పత్రికి తరలించారు. మూడలగి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.   

(చదవండి: పెళ్లింట విషాదం..గ్యాస్‌ సిలిండర్‌ పేలి ఐదుగురి మృతి.. పలువురికి సీరియస్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement