9 మంది ప్రాణాలు తీసిన నూడిల్స్‌‌

9 Of A Chinese Family Deceased After Eating Fermented Noodles For A Year - Sakshi

బీజింగ్‌ : సంవత్సరం పాటు ఫ్రిజ్‌లో ఉంచిన న్యూడిల్స్‌ను తిన్న తొమ్మిది మంది కుటుంబ సభ్యులు మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన చైనాలోని హీలాంగ్జియాంగ్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. చైనా, హీలాంగ్జియాంగ్‌ నార్త్‌ ఈస్ట్రన్‌ ప్రావిన్స్‌లోని జిసి నగరానికి చెందని ఓ కుటుంబం కొద్దిరోజుల క్రితం.. దాదాపు ఒక సంవత్సరం పాటు ఫ్రిజ్‌లో ఉంచిన సుఅన్‌టాంగ్జీ ( న్యూడిల్స్‌తో తయారు చేసిన వంటకం)ని తిన్నారు. దీంతో కుటుంబంలోని తొమ్మిది మంది అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆసుపత్రికి తీసుకుపోగా అక్కడ చికిత్స పొందుతూ అక్టోర్‌ 10వ తేదీన 8 మంది మృత్యువాత పడ్డారు. ఈ సోమవారం మరో మహిళ మృతిచెందింది. అదే కుటుంబానికి చెందిన ముగ్గురు పిల్లలు సదరు వంటకం రుచి నచ్చక దాన్ని తినటం మానేయటంతో ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ ఘటనపై ‘హీలాంగ్జియాంగ్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్‌’కు చెందిన ఫుడ్‌ సేఫ్టీ డైరెక్టర్ గావో పీయ్‌ మాట్లాడుతూ.. ‘‘ బాంగ్‌క్రెక్‌ అనే విషం కారణంగానే వారు మృత్యువాత పడ్డారు. చెడిపోయిన పదార్థాలలో అది ఎక్కువగా ఉంటుంది. ( ఏనుగును కి.మీ. ఈడ్చుకెళ్లిన రైలు ఇంజన్‌ సీజ్‌ )

బాంగ్‌క్రెక్‌ మన శరీరంలోకి చేరిన వెంటనే ప్రభావం చూపుతుంది. కడుపునొప్పి, చెమట పడ్డటం, నీరసం, కోమా.. 24 గంటల్లో మరణం కూడా సంభవించవచ్చు. ఆ విషం మన శరీరంలోని కీలక అవయవాలైన కిడ్నీలు, లివర్‌, గుండె, బ్రెయిన్‌ను దెబ్బ తీస్తుంది. ప్రస్తుతం దానికి విరుగుడు మందు లేదు. ఒక సారి ఆ విషం మన శరీరంలోకి చేరితే చనిపోయే అవకాశాలు 40-100 శాతం వరకు ఉన్నాయి. మనం ఎంత వేడి చేసినా బాంగ్‌క్రెక్‌ నశించదు. అది కొబ్బరి పదార్థాలను ఎక్కువ రోజులు పులియబెట్టడం వల్ల ఉత్పత్తి అవుతుంది. అందుకే ఇండోనేషియన్‌ సంప్రదాయ వంటకం ‘టెంపె బాంగ్‌క్రెక్‌’ను నిషేధించార’’ని తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top