విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

Jun 19 2025 4:14 AM | Updated on Jun 19 2025 4:14 AM

విద్య

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

కుప్పం రూరల్‌ : ప్రమాదవశాత్తు విద్యుత్‌ షాక్‌కు గురై వ్యక్తి దుర్మరణం పాలైన సంఘటన కుప్పం మండలం నూలుకుంట గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా.. నూలుకుంట గ్రామానికి చెందిన నాగప్ప (64) జీవనోపాధి కోసం చికెన్‌ దుకాణం నిర్వహిస్తున్నాడు. బుధవారం కోళ్లను కోసి బాయిలర్‌లో వేసి క్లీన్‌ చేసే సమయంలో బాయిలర్‌కు వచ్చే విద్యుత్‌ తీగకు ఎలుకలు కొరికి ఉన్న విషయం గుర్తించలేదు. దీంతో బాయిలర్‌ స్విచ్‌ వేయగానే నాగప్ప విద్యుత్‌ షాక్‌కు గురయ్యాడు. కొన ఊపిరితో ఉన్న నాగప్పను కుటుంబ సభ్యులు కుప్పం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడికి చేరుకోగానే నాగప్ప మృతి చెందినట్లు తెలిపారు. కాగా నాగప్పకు భార్య , నలుగురు పిల్లలు ఉన్నారు.

పొలానికి రాకుండా దౌర్జన్యం

– బాధిత మహిళా రైతు ఆవేదన

పలమనేరు : తమ పొలాన్ని ఆక్రమించుకొనేందుకు ఓ టీడీపీ నేత ప్రమేయంతో కొందరు ప్రయత్నిస్తున్నారని తమ పొలం వద్దకు రానివ్వకుండా దౌర్జన్యం చేస్తున్నారని బైరెడ్డిపల్లి మండలం చిక్కనపల్లికి చెందిన బాధితులు రమాదేవి కుటుంబీకులు బుధవారం ఆవేదన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ తమకు శెట్టిపల్లి రెవెన్యూలో 2.72 సెంట్ల డీకేటీ భూమి ఉందని దాన్ని 20 ఏళ్లుగా సాగుచేస్తున్నామని తెలిపారు. ఇదే భూమిపై బ్యాంకులో రుణం కూడా పొందామన్నారు.అయితే బేలుపల్లికి చెందిన ఓ టీడీపీ నేత ప్రోద్భలంతో తమ పొలాన్ని పక్కనున్న భూమి వారికి ఇవ్వడానికి రంగం సిద్ధం చేసి జేసీబీతో తమ పొలాన్ని వారి పొలంలో కలిపేలా పనులు చేశారన్నారు. దీనిపై తాము రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేస్తే వారు టీడీపీ నాయకులను కలసి పరిష్కరించుకోవాలని తామేమీ చేయలేమని చెప్పారన్నారు. దీంతో బేలుపల్లికి చెందిన టీడీపీ నేతవద్దకెళితే తాను చెప్పినంత డబ్బులిస్తే మీ భూమి మీకు దక్కుతుందని లేదంటే మీభూమి పక్కనున్న వాళ్లకి చేసేస్తామని బెదిరిస్తున్నాడని వాపోయారు.

గోల్డ్‌ లోన్‌ కేసులో పోలీసుల అదుపులో మరికొందరు

పలమనేరు : పట్టణంలోని కనకదుర్గ గోల్డ్‌లోన్‌ ఫైనాన్స్‌ కంపెనీలో జరిగిన మోసం కేసులో మరికొందరిని పలమనేరు పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. గత మార్చిలో ఈ కేసుకు సంబంధించి ఎనిమిది మందిని అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఇందులో సంబంధం ఉన్న మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయమై స్థానిక సీఐ నరసింహరాజును వివరణ కోరగా మరికొందరిని విచారిస్తున్నామని తదుపరి వివరాలు వెల్లడిస్తామన్నారు.

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి 
1
1/2

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి 
2
2/2

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement