చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలోని నాగయ్య కళాక్షేత్రంలో 19న అగ్నివీర్ వాయు పథకంపై అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు ఇంచార్జి కలెక్టర్ విద్యాధరి తెలిపారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. భారత వైమానిక దళం ఆధ్వర్యంలో యువతకు అగ్నివీర్పై అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. కార్యక్రమానికి 12వ ఎయిర్మెన్ సెలక్షన్ సెంటర్ సికింద్రాబాద్ నుంచి ఇండియన్ ఎయిర్ఫోర్స్ అధికారులు విచ్చేస్తారన్నారు. భారత వైమానిక దళంలో ఉండే వివిధ ఉద్యోగ అవకాశాలు, అగ్నివీర్ పథకం విషయాలపై అవగాహన కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. జిల్లాలోని యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇంచార్జి కలెక్టర్ కోరారు.
వాయిదా వేసిన డీఎస్సీ
పరీక్షలు జులైలో నిర్వహణ
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఈనెల 20, 21 తేదీల్లో నిర్వహించాల్సిన డీఎస్సీ పరీక్షలు వాయిదా వేశారని డీఈఓ వరలక్ష్మి తెలిపారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ఈనెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నందున 20, 21 తేదీల్లో నిర్వహించే డీఎస్సీ పరీక్షలను వాయిదా వేశారన్నారు. వాయిదా వేసిన పరీక్షలను తిరిగీ జులై 1, 2 తేదీల్లో నిర్వహిస్తారన్నారు. మారిన పరీక్ష కేంద్రాలు, తేదీలతో హాల్ టికెట్లు ఈనెల 25వ తేదీ నుంచి https://apdsc.apcfsc.in వెబ్సైట్లో అందు బాటులో ఉంటాయని డీఈఓ వెల్లడించారు.
డీపీటీఓగా రాము
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : చిత్తూరు నగరం ఆర్టీసీ బస్టాండులోని కార్యాలయంలో బుధవా రం డీపీటీఓగా రాము బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న జగదీష్ తిరుపతి డీపీటీఓగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో రాము బాధ్యతలను స్వీకరించారు.
అప్రెంటీస్కు
దరఖాస్తుల ఆహ్వానం
తిరుపతి ఎడ్యుకేషన్ : టీటీడీ రవాణా శాఖలో ఏడాది పాటు అప్రెంటీస్ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తిరుచానూరు రోడ్డు, పద్మావతిపురంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్/కన్వీనర్ పి.గణేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అప్రెంటీస్కు తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలల్లో మెకానిక్ మోటార్ వెహికల్, ఎలక్ట్రీషియన్ ట్రేడ్లలో పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులన్నారు. పది, ఐటీఐ విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్, బ్యాంక్ పాస్బుక్, మొబైల్ నంబరు, మెయిల్ ఐడీ, పాన్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, రెండు పాస్పోర్ట్ సైజు ఫొటోలతో ఈ నెల 30వ తేదీలోపు ప్రభుత్వ ఐటీఐ కళాశాలలోని అప్రెంటీస్షిప్ అడ్వైజర్ సి.గంగాధరానికి దరఖాస్తులను సమర్పించాలన్నారు. పూర్తి వివరాలకు 94416 47174, 95507 22922 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
డీఈఓకు డైట్ ప్రిన్సిపల్గా అదనపు బాధ్యతలు
కార్వేటినగరం : చిత్తూరు డీఈఓగా విధులు నిర్వహిస్తున్న బి.వరలక్ష్మికి జిల్లా విద్యాశిక్షణా సంస్థ (డైట్) ప్రిన్సిపల్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. గతంలో డైట్ ప్రిన్సిపల్గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ శేఖర్ గత నెల 30న పదవీ విరమణ పొందారు. ఇక ఏకై క సీనియర్ అధ్యాపకుడిగా విధులు నిర్వహిస్తున్న ఎస్.సుబ్రమణ్యం అన్నమయ్య జిల్లా డీఈఓగా వెళ్లడంతో కార్వేటినగరం డైట్ ప్రిన్సిపల్గా చిత్తూరు డీఈఓ వరలక్ష్మికి అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించిందని, త్వరలో బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలిపారు.