
అవి పచ్చ పార్టీకి కొత్తేమీ కాదు
నగరి : యువకుల జీవితాలతో చెలగా టాలు పచ్చపార్టీకి కొత్తేమీ కాదని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే రప్పారప్పా కోస్తాం అంటూ పల్నాడు జిల్లా రెంటపాళ్లలో వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూడడానికి వచ్చిన జనంలో నుంచి ఒక యువకుడు ప్లకార్డు చూపడంతో వచ్చిన వివాదాలపై ఆమె గురువారం స్పందించారు. ప్లకార్డు ప్రదర్శించిన రవితేజను సత్తెనపల్లి పోలీసులు అరెస్టు చేశారని, నిజానికి రవితేజ టీడీపీకి చెందిన వ్యక్తి అన్నారు. ఉద్దేశపూర్వకంగా అలజడి సృష్టించడానికి టీడీపీ చేసిన కుట్ర అని తేటతెల్లమైందన్నారు. తమ బిడ్డ టీడీపీలో ఉన్నాడని స్వయంగా వారి కుటుంబ సభ్యులు చెప్పడమే ఇందుకు నిదర్శనమన్నారు. రవితేజ టీడీపీ సభ్యత్వ నమోదు కార్డును కూడా వారు చూపెట్టినట్టు గుర్తుచేశారు. రవితేజను బలవంతంగా తీసుకువెళ్లడంతోనే ప్లకార్డులు పట్టుకున్నాడని తెలిపారు.