
‘మద్దతు’గా నిలవాల్సిందే!
● రేపు కలెక్టరేట్ వద్ద మామిడి రైతుల నిరసన ● ప్రభుత్వం ప్రకటించిన కిలోకు రూ.12 అమలు చేయాల్సిందే ● లేకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తాం ● హెచ్చరించిన రైతు సంఘాల నాయకులు
జ్యూస్ ఫ్యాక్టరీని సందర్శించిన జేసీ
మండలంలోని నలగాంపల్లెలోని సన్గోల్డ్ జూస్ ఫ్యాక్టరీని గురువారం జేసీ విద్యాధరి సందర్శించారు. తోతాపుర మామిడి కాయలను రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారా లేదా, కాయల కొతలకు సంబంధించి తీసుకుంటున్న నియమ నిబంధనలు, జూస్ ఫ్యాక్టరీ వద్ద రైతులకు అందుతున్న సదుపాయాలపై ఆరా తీశారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు తోతాపురి కొనుగోలు చేయాలని సూచించారు. తహసీల్దార్ బాబురాజేంద్రప్రసాద్, ఏఓ భారతి పాల్గొన్నారు.
చిత్తూరు రూరల్ (కాణిపాకం): మామిడి రైతులను ఆదుకోవడంలో జిల్లా యంత్రాంగం పూర్తిగా విఫలమైందని, ముఖ్యమంత్రి, వ్యవసాయశాఖ మంత్రి మాటలకు కూడా విలువ లేకుండా పోయిందని రైతులు ధ్వజమెత్తారు. ఈ మేరకు కలెక్టరేట్ వద్ద శనివారం సత్యాగ్రహం నిర్వహించనున్నట్టు మామిడి రైతుల సంక్షేమ సంఘ నాయకులు జనార్దన్, ఎస్.ఆనంద నాయుడు ప్రకటించారు. జిల్లాలో గురువారం మామిడి రైతుల సంక్షేమ సంఘం కమిటీ జూమ్ మీటింగ్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా మామిడి రైతులకు గుజ్జు ఫ్యాక్టరీల యజమానులు, ర్యాంపుల నిర్వాహకులు నరకయాతన చూపిస్తున్నారన్నారు. ఇంకోపక్క జిల్లా యంత్రాంగం ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర అమలు చేయాల్సి ఉండగా పూర్తిగా చేతులెత్తేయడం దారుణమన్నారు. జిల్లాలో ఇప్పటివరకు ఫ్యాక్టరీ యజమానులు, ర్యాంపుల నిర్వాహకులు ధరల పట్టిక ప్రదర్శించకపోవడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఖాతరుచేయని ఫ్యాక్టరీల లైసెన్సులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అమరావతిలో సీఎం జరిపిన సమీక్ష సమావేశంలో సైతం కిలోకు రూ.12 మద్దతు ధర కచ్చితంగా కల్పిస్తామని స్పష్టం చేసినా.. జిల్లాలో ఎక్కడా అమలు కాకపోవడం ఏమిటని ప్రశ్నించారు. మామిడి ఫ్యాక్టరీల వద్ద అన్లోడింగ్ సైతం పూర్తిగా రాజకీయ జోక్యం పెచ్చుమీరుతోందని తెలిపారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పల్ఫ్ నిల్వలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. సమావేశంలో హరిబాబు, ఉమాపతినాయుడు, సంజీవరెడ్డి, భారతి పాల్గొన్నారు.
రైతులకు నష్టం కలగకుండా చూస్తాం
బంగారుపాళెం: మామిడి రైతులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సుమిత్కుమార్ స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం బంగారుపాళెం మామిడి మార్కెట్ ఆవరణలో మామిడి మండీ యజమానులు, రైతులతో మద్దతు ధరపై సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ తోతాపురి(బెంగళూర)మామిడి కాయలను చివర కేజీ వరకు కొనుగోలు చేస్తామన్నారు. దీనిపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రైతులు నష్టపోకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపటిందన్నారు. ప్రభుత్వం అందించే రూ.4 మద్దతు ధర సబ్సిడీ రూపంలో రైతుల వ్యక్తిగత బ్యాంక్ ఖాతాకు జమచేస్తామాన్నరు. కాయలు పక్వానికి రాకముందే జ్యూస్ ఫ్యాక్టరీలకు తరలించొద్దని సూచించారు. జేసీ విద్యాధరి, మార్కెట్శాఖ ఏడీ పరమేశ్వర్, ఉద్యానశాఖ డీడీ మధుసూదన్రెడ్డి, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు పాల్గొన్నారు.
ఆకస్మిక తనిఖీ
గంగాధరనెల్లూరు: జైన్ మామిడి గుజ్జు పరిశ్రమను గురువారం రాత్రి కలెక్టర్ సుముత్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కర్మాగారం వద్ద ఉన్న రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. మామిడి కొనుగోలుపై ఎలాంటి రాజకీయ జోక్యం ఉండదని స్పష్టం చేశారు. జిల్లా హార్టికల్చర్ డీడీ మధుసూదన్ రెడ్డి, డీఆర్డీవో పీడీ శ్రీదేవి, జైన్ మేనేజర్ దీలీప్ శర్మ, ఇన్చార్జ్ తహసీల్దార్ తులసీరాం, ఎంపీడీవో కృష్ణమహేష్రెడ్డి పాల్గొన్నారు.
మద్దతు ధర చెల్లించకుంటే చర్యలు
తోతాపురి మామిడికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర చెల్లించాలని, లేకుంటే చర్యలు తప్పవని కలెక్టర్ సుమిత్కుమార్ హెచ్చరించారు. గురువారం జీడీనెల్లూరులోని జైన్ ఫ్యాక్టరీని ఆయన సందర్శించారు. మామిడి కాయల కొనుగోలుపై పరిశ్రమ యాజమాన్యం, రైతులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మేరకు తోతాపురికి మద్దతు ధర చెల్లించాలన్నారు. మద్దతు ధర చెల్లించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. గుజు పరిశ్రమలకు మామిడికాయలను తెచ్చే రైతులకు కనీస సౌకర్యాలు కల్పించాలని తహసీల్దార్, ఎంపీడీవోలను ఆదేశించారు. జిల్లాలో మామిడి దిగుబడి ఎక్కువగా ఉండడంతో ప్యాకింగ్ మెటీరియల్ను సమకూర్చుకుని ప్రాసెసింగ్ యూనిట్ల కెపాసిటీని పెంచుకోవాలని సూచించారు. డీఆర్డీఓ పీడీ శ్రీదేవి, మండల ఇన్చార్జ్ తహసీల్దార్ తులసీరాం, జైన్ మేనేజర్ పాల్గొన్నారు.
పక్వానికి వచ్చిన కాయలనే కోయండి
తవణంపల్లె: మామిడి రైతులు పక్వానికి వచ్చిన కాయలు కోసి ఫ్యాక్టరీలకు తరలించాలని జడ్పీ సీఈఓ రవికుమార్ నాయుడు సూచించారు. మండలంలోని టి.పుత్తూరు, ఎగువ తవణంపల్లె గ్రామాల్లో మామిడి పంట కోత కోయడంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఈఓ మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం ప్రకటించిన రూ.4 మద్దతు ధర చిట్టచివరి పంట వరకు ఇచ్చేందుకు జీఓ కూడా విడుదల చేసిందన్నారు. రూ.4 మద్దతు ధర ఆగిపోతుందని అపోహలు వద్దన్నారు. అనంతరం ఎఫ్–3 ఫ్యాక్టరీని తనిఖీ చేశారు. రైతులకు నష్టం జరగకుండా ఫ్యాక్టరీ యజమానులు చర్యలు చేపట్టాలన్నారు. ఎంపీడీఓ హరిప్రసాద్ రెడ్డి, ఇన్చార్జ్ వ్యవసాయాధికారి వందన పాల్గొన్నారు.
మామిడి రైతుల గోడు కూటమికి పట్టదా?
బంగారుపాళెం: మామిడి రైతుల గోడు కూటమికి పట్టనట్టుందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ పూతలప ట్టు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సునీల్కుమా ర్ ధ్వజమెత్తారు. మామిడి పంటకు కనీస గిట్టుబాటు ధర లేక గత 15 రోజులుగా రైతులు అష్టకష్టాలు పడుతున్నారని వాపోయారు. జిల్లాలో అత్యధికంగా బెంగళూర(తోతాపురి)రకం పంటను రైతులు సాగుచేస్తున్నారన్నారు. పండిన పంటను అమ్ముకునేందుకు మండీలు, జ్యూస్ ఫ్యాక్టరీల వద్ద అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మండీలు, ర్యాంప్లలో కిలో రూ.3 నుంచి రూ.4కు కొనుగోలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.8కు జ్యూస్ ఫ్యాక్టరీ యజమానులు కొనుగోలు చేయకపోవడంతో అవస్థలు పడాల్సి వస్తోందన్నారు. జ్యూస్ ఫ్యాక్టరీల వ ద్ద పర్మిట్ల కోసం వారాల తరబడి తిరగాల్సివస్తోంద న్నారు. పర్మిట్లు పొంది కాయలు కోసి ఫ్యాక్టరీలకు తరలిస్తే అక్కడ రోజుల తరబడి ఉండాల్సి వస్తోందని చె ప్పారు. రైతులు పండించిన పంటకు వేరొక్కరు మద్ద తు ధర ప్రకటించాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు.

‘మద్దతు’గా నిలవాల్సిందే!