
తల్లులకు బాబు ఎగనామం
● చంద్రబాబు పాలనపై మాజీ ఉప ముఖ్యమంత్రి మండిపాటు
కార్వేటినగరం : నీకు 15 వేలు.. నీకు 15 వేలు అంటూ ప్రచారంలో ఊదరగొట్టిన చంద్రబాబు నేడు తల్లికి వందనం పేరుతో విద్యార్థుల తల్లులకు ఎగనామం పెట్టారని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ధ్వజమెత్తారు. బుధవారం మండల పరిధిలోని అల్లాగుంట ఇందిరా కాలనీ వద్ద కూటమి ఏడాది పాలనపై వెన్నుపోటు పుస్తకాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలసి ఆవిష్కరించారు. అనంతరం మాజీ ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అమ్మ ఒడి పథకం ద్వారా 84 లక్షల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు అందరికీ తల్లికి వందనం అందిస్తానని చెప్పిన నేడు సాంకేతిక సమస్యల పేరుతో లక్షల మందికి మోసం చేశారని ఆరోపించారు. ఆంగ్ల మాధ్యమాన్ని తొలగించి పేదలకు అన్యాయం చేశారన్నారు.
పాఠశాలల విలీనం పేరుతో పేద విద్యార్థులకు చదువును దూరం చేసేందుకు కుట్ర పన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత జగనన్న ప్రభుత్వంలో మామిడి రైతులకు రూ.30 అందిస్తే నేడు చంద్రబాబు ప్రభుత్వం రూ.5 కూడా చెల్లించక పోవడం దారుణం అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి చందురాజు, మండల మాజీ కన్వీనర్ ధనంజయవర్మ, ఎంపీటీ మురగయ్య, సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు లోకనాధరెడ్డి, మాజీ సర్పంచ్ఽలు అమీద్, కుప్పారెడ్డి, మునికృష్ణ, నందగోపాల్, దేవరాజ్, స్టీఫెన్, దనశేఖర్యాదవు,గాంధీ,ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు.