ఎలాగూ మనం ఈలోపు సీట్ల సర్దుబాటు, పీఎం అభ్యర్థిని డిసైడ్ చేసుకోలేమని అనుకుంటున్నారు..!
Breadcrumb
ఎలాగూ మనం ఈలోపు సీట్ల సర్దుబాటు, పీఎం అభ్యర్థిని డిసైడ్ చేసుకోలేమని అనుకుంటున్నారు..!
Published Wed, Aug 30 2023 1:32 PM
Related news
-
కూటమికి బీఎస్పీ పోటు!
సాక్షి, న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల్లో ఉత్తరాదిలో బీజేపీ కోటను బద్దలు కొట్టాలన్న విపక్ష ఇండియా కూటమి ఆశలపై బీఎస్పీ అధినేత్రి మాయావతి నీళ్లు చల్లేలా కని్పస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర్ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్గఢ్ రాష్ట్రాలఓల బీజేపీని నిలువరించేందుకు ఓట్ల సమీకరణకు కాంగ్రెస్ కిందా మీదా పడుతోంది. ఆ ప్రయత్నాలను వమ్ము చేసేలా బీఎస్పీ వ్యవహరిస్తోంది.ముఖ్యంగా యూపీలో ముస్లిం ఓట్ల సమీకరణతో బీజేపీ స్థానాలకు భారీగా గండి కొట్టాలని కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నాయి. కానీ ముస్లిం ఓట్లను నిలువునా చీల్చేలా రాష్ట్రంలో బీఎస్పీ ముస్లింలకు ఎక్కువ టికెట్లిచ్చింది! అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికే ప్రాభవం కోల్పోయిన బీస్పీ లోక్సభ ఎన్నికల్లోనైనా ఉనికిని కాపాడుకునేందుకు చేస్తున్న ఈ ప్రయత్నాలు ఇండియా కూటమికి ప్రాణ సంకటంగా పరిణమిస్తున్నాయి. యూపీలో కూటమికి దెబ్బే! అత్యంత కీలకమైన యూపీలో 80 స్థానాలకు గానూ బీజేపీ ఈసారి సొంతంగానే 70 సీట్లపై గురిపెట్టింది. పొత్తులో భాగంగా కట్టిన కాంగ్రెస్ 13, ఎస్పీ 67 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. యూపీలో 21 శాతమున్న యాదవ ఓట్లకు 19 శాతం ముస్లిం ఓట్లు కలిస్తే భారీగా ఓట్లు రాలుతాయని ఆశ పడుతున్నాయి. రాష్ట్రంలో ఏకంగా 18 జిల్లాల పరిధిలోని పలు లోక్సభ స్థానాల్లో ముస్లింలు నిర్ణాయక శక్తిగా ఉన్నారు. వీటిలో పలు జిల్లాలో ముస్లిం జనాభా ఏకంగా 30 శాతం పైగా ఉంది. వీరంతా కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీలకు సంప్రదాయ ఓటు బ్యాంకే.దాంతో ముస్లింల ఓట్లను సంఘటితంగా తమవైపు సమీకరించుకునేందుకు కాంగ్రెస్, ఎస్పీ వారికి 11 సీట్లు కేటాయించాయి. మాయా నిర్ణయాలు వాటి ప్రయత్నాలకు గండి కొట్టేలా ఉన్నాయి. బీఎస్పీ ఈసారి ఏకంగా 18 స్థానాల్లో ముస్లింలకే టికెట్లిచ్చింది! దాంతో ముస్లిం ఓట్లకు గండిపడి ఎస్పీ/కాంగ్రెస్ అభ్యర్థుల అవకాశాలకు గండిపడేలా కని్పస్తోంది. ఇక దళిత ప్రాబల్య పశ్చిమ యూపీలో వాటి ఓట్లను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్/ఎస్పీ విశ్వప్రయత్నాలు చేస్తుంటే అక్కడా బీఎస్పీ ప్రచారాన్ని ఉధృతం చేసి కాంగ్రెస్పై ముప్పేట దాడి కొనసాగిస్తోంది. ఇది వాటికి మరో తలనొప్పిగా మారింది. రాజస్థాన్లోనూ బీఎస్పీ ఆరుచోట్ల ముస్లింలకు టికెటిచ్చింది! మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్లలోనూ ఇదే పరిస్థితి! లోక్సభ ఎన్నికల్లో యూపీలో బీఎస్పీ ప్రదర్శన ఎన్నికలు సీట్లు ఓట్ల శాతం 2004 19 5.33 2009 21 6.17 2014 0 4.19 2019 10 3.67 ప్రభావం తగ్గలేదు బహుజన నేత కాన్షీరాం వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన మాయావతి నాలుగుసార్లు యూపీ ముఖ్యమంత్రిగా చేశారు. రాష్ట్రంలో 21 శాతమున్న ఎస్సీల్లో సగానికి పైగా జాతవ్లే. ఆ కులం నుంచి వచ్చిన మాయావతికి వారిపై పట్టు ఉంది. కానీ 2017, 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్సీలు పూర్తిగా బీజేపీ వైపు మొగ్గడంతో మాయా ప్రభను కోల్పోయారు. 2017లో బీఎస్పీకి 19 సీట్లు రాగా 2022లో ఒక్కటంటే ఒక్క సీటే వచ్చింది! కాకపోతే ఆ ఎన్నికల్లో బీఎస్పీ 12.88 శాతం ఓట్లు సాధించింది.ఇక 2004 లోక్సభ ఎన్నికల్లో 19, 2009లో 21 సీట్లు సాధించిన బీఎస్పీ, 2014లో మాత్రం ఖాతాయే తెరవలేకపోయింది. 2019లో ఎస్పీ, రాష్ట్రయ లోక్దళ్తో పొత్తుల వల్ల 10 సీట్లు గెలుచుకుంది. కానీ వారిలో ఐదుగురు ఎంపీలు పార్టీని వీడారు. ఈ ఎన్నికల్లో మాయవతి ఒంటరిగా పోరాడుతున్నారు. యూపీలో 80 స్థానాలకు గానూ 64 చోట్ల అభ్యర్థులను నిలిపారు. అలాగే రాజస్థాన్లో 25, మధ్యప్రదేశ్లో 7, ఛత్తీస్గఢ్లో 8 స్థానాల్లోనూ బీఎస్పీ పోటీ చేస్తోంది. ఈసారి కూడా ముస్లిం దళిత ఫార్ములాతోనే ఆమె బరిలో దిగారు. ఆమె ప్రచార సభలకు జనం భారీగా వస్తున్నారు. దాంతో మాయా దెబ్బకు మోదీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందని కాంగ్రెస్ తదితర విపక్షాలు భయపడుతున్నాయి. -
కళింగ యుద్ధం!
పోలింగ్ తేదీలు: మే 13, 20, 25, జూన్ 1సర్వేలు ఏం చెబుతున్నాయి... బీజేడీకి 11, బీజేపీకి 10 లోక్సభ స్థానాలు రావొచ్చని సర్వేలు అంచనా వేశాయి. అసెంబ్లీలోనూ బీజేపీ–బీజేడీ మధ్య టఫ్ ఫైట్ ఉండొచ్చని అంచనా. బీజేడీనే అధికారాన్ని నిలబెట్టుకున్నా బీజేపీకి 60 సీట్ల వరకు వస్తాయని సర్వేలు చెబుతున్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటైన ఒడిశాలో పాతికేళ్లుగా బిజూ జనతాదళ్ అధినేత నవీన్ పట్నయక్ ఏకఛత్రాధిపత్యం సాగుతోంది. లోక్సభ ఎన్నికల్లోనూ ప్రతిసారీ మెజారిటీ స్థానాలు బీజేడీకే దక్కుతున్నాయి. గత ఎన్నికల్లో మాత్రం బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. రాష్ట్రంలో పాగా వేసేందుకు బలమైన పునాదులు ఏర్పాటు చేసుకుంది. రాష్ట్రంలో మళ్లీ సత్తా చాటేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ‘కళింగ’ యుద్ధంలో ఈసారి మూడు పార్టీలూ హోరాహోరీగా తలపడుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ ఒడిశాలో లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. గత లోక్సభ ఎన్నికల్లో బీజేడీకి ఊహించని షాక్ తగిలింది. మొత్తం 21 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసి 12 సీట్లకే పరిమితమైంది. 8 సీట్లు కోల్పోయింది. బీజేపీ కూడా ఒంటరిగా బరిలో నిలిచి 8 స్థానాలు కొల్లగొట్టింది! 2014 ఎన్నికల్లో ఒకే ఒక్క సీటు గెలుచుకున్న కాషాయ పార్టీ ఏకంగా 7 సీట్లను పెంచుకుంది. కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ కూటమి పూర్తిగా చేతులెత్తేసింది. కాంగ్రెస్ 18 చోట్ల పోటీ చేసినా ఒక్క సీటుకే పరిమితమైంది. సీపీఐ, సీపీఎం, జేఎంఎం సున్నా చుట్టాయి. నవీన్ మ్యాజిక్... సీఎంగా, కేంద్ర మంత్రిగా వెలుగు వెలిగిన బిజూ పట్నయక్ కుమారుడైన నవీన్ 1997లో జనతాదళ్ను వీడారు. బిజూ జనతాదళ్ (బీజేడీ) పేరుతో పార్టీ పెట్టి తిరుగులేని శక్తిగా అవతరించారు. ఒడిశా అంటే నవీన్ పట్నయక్ అనే స్థాయిలో పాతికేళ్లుగా పాతుకుపోయారు. వరుసగా ఐదుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి సీఎంగా కొనసాగుతున్న రెండో వ్యక్తిగా (సిక్కింలో పవన్ చామ్లింగ్ తర్వాత) నిలిచారు. తొలుత కేంద్రంలో ఎన్డీఏ కూటమిలో చేరిన నవీన్ వాజ్పేయి ప్రభుత్వంలో గనుల శాఖ మంత్రిగా చేశారు. 2000 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుతో మెజారిటీ సీట్లను గెల్చుకుని తొలిసారి ఒడిశా సీఎం అయ్యారు. నాటి నుంచి పదవిలో కొనసాగుతున్నారు. 2004లో ఎన్డీఏ కేంద్రంలో అధికారం కోల్పోయినా ఒడిశాలో మాత్రం నవీన్ జోరు తగ్గలేదు. 2008లో కొంధొమాల్ జిల్లాలో అల్లర్ల నేపథ్యంలో ఎన్డీఏ కూటమిని వీడారు నాటినుంచీ ఒంటరిగానే పోటీ చేస్తూ వస్తున్నారు. లోక్సభ పోరులో తడబాటు 2019లోనూ ఒడిశాలో జమిలి ఎన్నికలు జరిగాయి. అసెంబ్లీలో 147 స్థానాలకు 112 చోట్ల నెగ్గిన బీజేడీ లోక్సభ పోరులో 12 సీట్లకు పరిమితమైంది. అనూహ్యంగా 8 సీట్లకు ఎగబాకిన బీజేపీ, అసెంబ్లీలో కూడా బలాన్ని 10 నుంచి 23 సీట్లకు పెంచుకుంది. కాంగ్రెస్ కేవలం 9 అసెంబ్లీ స్థానాలతో సరిపెట్టుకుంది. ఎన్డీఏకు దూరంగా ఉన్నా పార్లమెంట్లో పలు కీలక బిల్లులపై ఎన్డీఏకు బీజేడీ మద్దతు కొనసాగిస్తూనే ఉంది! 15 ఏళ్ల తర్వాత నవీన్ మరోసారి ఎన్డీఏలో చేరేలా కని్పంచినా చివరికి ఒంటరిగానే బరిలోకి దిగాలని నిర్ణయించారు. ప్రధానంగా రాష్ట్రంలో అభివృద్ధి ఎజెండాను నవీన్ ఎన్నికల ప్రచారాస్త్రంగా చేసుకున్నారు. అభివృద్ధే మా నినాదం, గుర్తింపు. దీనికి ప్రతిపక్షాలు అడుగడుగునా అడ్డుపడుతున్నాయి. ప్రతిదీ రాజకీయం చేస్తూ ప్రాజెక్టులకు మోకాలడ్డుతున్నాయి. అభివృద్ధి నిరోధకులుగా మారాయి. వాటి అసలు రంగేమిటో ఒడిశా ప్రజలకు తెలుసు. వచ్చే పదేళ్లను ‘ఒడిశా దశాబ్ది’గా మార్చి చూపిద్దాం. 2036 నాటికి రాష్ట్రాన్ని దేశంలో నంబర్వన్గా నిలిపేందుకు పునరంకితమవుదాం. – హింజిలిలో ఎన్నికల ప్రచార ప్రారంభం సందర్భంగా సీఎం నవీన్ పట్నాయక్ ఒడిశాలో రాష్ట్రాన్ని నడుపుతున్నది అధికారులే. బీజేడీ ప్రభుత్వం పూర్తిగా చతికిలపడింది. అపారమైన ఖనిజ వనరులున్నా రాష్ట్ర ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారు. నవీన్ పట్నయక్కు పాతికేళ్లు అధికారం కట్టబెట్టారు. మాకు ఐదేళ్లు అవకాశమివ్వండి. 20 ఎంపీ స్థానాల్లో గెలిపించండి. డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలున్న రాష్ట్రాలకు దీటుగా అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాం. – సోనేపూర్ ఎన్నికల సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇండియా కూటమి పోటీ ఇచ్చేనా...! కాంగ్రెస్ పరిస్థితి ఒడిశాలో నానాటికీ తీసికట్టుగా మారుతోంది. నాయకత్వం లేమితో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు రెండింట్లోనూ పేలవ ప్రదర్శన చేస్తోంది. ఈసారి కేంద్ర రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకోవాలని ఆశ పడుతోంది. ఒడిశాలో 93 శాతం హిందువులే. 3 శాతం క్రైస్తవులు, 2.5 శాతం మేర ముస్లింలున్నారు.హిందూ జనాభాలో 40 శాతం ఆదివాసీలు, దళితులు. వీరిలో ఎస్టీలు 23 శాతముంటారు. ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీ ఓట్లే లక్ష్యంగా చేపట్టిన దేశవ్యాప్త కులగణన అస్త్రం ఒడిశాలో బాగా కలిసొస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. 6 న్యాయాలు, 25 గ్యారంటీలతో కూడిన మేనిఫెస్టోను కూడా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. ఇండియా కూటమిలో భాగంగా జేఎంఎం, సీపీఐ, సీపీఎంతో కలిసి పోటీ చేస్తోంది. మోదీ హయాంలో నిరుద్యోగం, ధరల పెరుగుదల, కార్పొరేట్లతో కుమ్మక్కు అంశాలను కూడా గట్టిగా ప్రచారం చేస్తోంది. బీజేపీలోకి వలసల జోరు బీజేపీకి ఒడిశాలో ఒకప్పుడు సరైన ప్రాతినిధ్యమే లేదు. అలాంటిది ఇప్పుడు లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేడీతో నువ్వా నేనా అన్నట్టుగా తలపడే స్థాయికి చేరింది. మోదీ ఫ్యాక్టర్తో పాటు అభివృద్ధి ఎజెండా, రామమందిర అంశంతో హిందూ ఓటు బ్యాంకును కొల్లగొట్టేలా ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తోంది. ఈసారి ఎంపీ సీట్లను రెండంకెలకు పెంచుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. బీజేడీ నుంచి పలువురు నేతలు కాషాయ తీర్థం పుచ్చుకుంటుండటం విశేషం. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బీజేడీ నేత అరబింద ధాలి బీజేపీలో చేరారు.రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని బల్లగుద్ది చెబుతున్నారు! కటక్ నుంచి వరుసగా 6 సార్లు ఎంపీగా గెలిచిన బీజేడీ నేత భర్తృహరి మహతాబ్ కూడా బీజేపీ గూటికి చేరారు. ఆ పార్టీ టికెట్పై అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. ఆయన ఒడిశా తొలి సీఎం కృష్ణహరి మహతాబ్ కుమారుడు. బీజేడీ వ్యవస్థాపక సభ్యుడు కూడా. ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు సిద్ధాంత్ మహాపాత్ర కూడా కాషాయ జెండా కప్పుకున్నారు. ఆయన బరంపురం నుంచి బీజేడీ తరఫున రెండుసార్లు ఎంపీగా గెలిచారు. రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రివర్గంలో కీలక నేతగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ ఈసారి సంభాల్పూర్ నుంచి బరిలోకి దిగారు. ఆయనను బీజేడీలో నంబర్ టూగా వెలుగుతున్న పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రణబ్ ప్రకాశ్ దాస్ ఢీకొంటున్నారు. దాంతో సంభాల్పూర్ హాట్ సీట్గా మారింది. -
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్! -
Sakshi News Cartoon: తను ఓటేయనన్నందుకు కాదు! వడదెబ్బ కొట్టినందుకు!!
-
First general elections: ఒక్క స్థానం.. ఇద్దరు ఎంపీలు!
ఒక్క లోక్సభ నియోజకవర్గానికి ఇద్దరు ఎంపీలుంటారా? ఇద్దరేం ఖర్మ... ముగ్గురు కూడా ఉన్నారు! ఎప్పుడు? ఎలా?మన దేశంలో రాజకీయాలు చాలా క్లిష్టంగా ఉ న్నాయని ఇప్పుడనుకుంటున్నాం. కానీ స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో జరిగిన ఎన్నికల సమయంలో మరింత సంక్లిష్టంగా ఉన్నాయి. సాధారణంగా ఒక్క నియోజకవర్గానికి ఒక్కరే ప్రాతినిధ్యం వహిస్తారు. ఎన్నికలు జరిగేదే ఆ ప్రతినిధిని ఎన్నుకోవడానికి. కానీ తొలి రెండు సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం పలు నియోజకవర్గాలకు ఇద్దరేసి ఎంపీల ను ఎన్నుకున్నారు. 1961లో రద్దయ్యే దాకా ఇది కొనసాగింది. కొన్ని నియోజకవర్గాలకైతే ముగ్గురు ఎంపీలూ ఉన్నారు! దళితులు, గిరిజన సమూహాల వంటి అణగారిన వర్గాలకు పార్లమెంటులో ప్రాతినిధ్యం పెంచేందుకు ఈ ఏర్పాటు కలి్పంచారు.తొలి ఎన్నికల్లో...మొట్టమొదటి ఎన్నికల సమయంలో లోక్సభలో 400 స్థానాలున్నాయి. వీటిలో 314 స్థానాలకు ఒక్క ఎంపీ ఉండగా, 86 నియోజకవర్గాలకు ఒక జనరల్, మరొక షెడ్యూల్ కులాల ప్రతినిధి చొప్పున ఇద్దరేసి ఎంపీలు ఎన్నికయ్యారు. ఇలా ఇద్దరు ఎంపీలున్న నియోజకవర్గాలు యూపీలో 17, నాటి మద్రాసు రాష్ట్రంలో 13, బిహార్లో 11, బాంబేలో 8 ఉన్నాయి. పశి్చమబెంగాల్లోని నార్త్ బెంగాల్ నియోజకవర్గానికయితే ఏకంగా ముగ్గురు ఎంపీలు ప్రాతినిధ్యం వహించారు!1957లో...సీట్ల పునరి్వభజన అనంతరం 1957 సార్వత్రి క ఎన్నికల్లో 494 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఇద్దరు ఎంపీల స్థానాలు 57కు తగ్గాయి. వీటిలో అత్యధికంగా ఉత్తరప్రద్రేశ్లో 18, ఆంధ్రప్రదేశ్లో 8, బిహార్లో 8, పశి్చమబెంగాల్లో 8, బాంబేలో 8, మద్రాసులో 7 స్థానాలకు ఇద్దరు ఎంపీలు ప్రాతినిధ్యం వహించారు. – సాక్షి, నేషనల్ డెస్క్
Related News by category
-
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్! -
Sakshi News Cartoon: తను ఓటేయనన్నందుకు కాదు! వడదెబ్బ కొట్టినందుకు!!
-
హామీలివ్వడానికి మనకు ఏమీ మిగల్చలేద్సార్! తనే అన్నీ ఇచ్చిమరీ నెరవేర్చారట!! ఇక పదండీ!
-
నా మీద ఒట్టేసుకోలేను! కావాలంటే నీ మీద ఒట్టేసి చెబుతున్నా నీకే ఓటేస్తానని!
నా మీద ఒట్టేసుకోలేను! కావాలంటే నీ మీద ఒట్టేసి చెబుతున్నా నీకే ఓటేస్తానని! -
సాక్షి కార్టూన్ 25-04-2024
Advertisement
Photos
View allVideo
View allహైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
- మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
- రెచ్చిపోయిన రౌడీ మూకలు
- కొత్త ఇంట్లోకి 'జబర్దస్త్' కమెడియన్.. వీడియో వైరల్
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
- Rishabh Pant: భారీ ప్రమాదం నుంచి మైదానం వరకు..
- స్టార్ హీరోయిన్ నుంచి కాంట్రవర్సీల వరకు.. సమంత గురించి ఇవి తెలుసా?
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement