శుక్రవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 160.73 పాయింట్లు లేదా 0.21 శాతం నష్టంతో 75,237.99 వద్ద, నిఫ్టీ 46.10 పాయింట్లు లేదా 0.19 శాతం నష్టంతో 23,643.50 వద్ద నిలిచాయి.
వేక్ఫిట్ ఇన్నోవేషన్స్ లిమిటెడ్, సాకర్ హెల్త్కేర్ లిమిటెడ్, అట్లాంటా లిమిటెడ్, షాడోఫాక్స్ టెక్నాలజీస్ లిమిటెడ్, సోలారా యాక్టివ్ ఫార్మా సైన్సెస్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. మోల్డ్-టెక్ టెక్నాలజీస్ లిమిటెడ్, నవ లిమిటెడ్, ఎంఐఆర్సీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, పిఎన్ గాడ్గిల్ జ్యువెలర్స్ లిమిటెడ్, బీటా డ్రగ్స్ లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.
Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.


