అదానీ షేర్ల జోరు, సెన్సెక్స్‌ 620 పాయింట్లు జంప్‌  | Sensex jumps 600 points Adani group shares shines | Sakshi
Sakshi News home page

అదానీ షేర్ల జోరు, సెన్సెక్స్‌ 620 పాయింట్లు జంప్‌ 

Mar 31 2023 9:33 AM | Updated on Mar 31 2023 9:54 AM

Sensex jumps 600 points Adani group shares shines - Sakshi

సాక్షి, ముంబై: అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో దేశీయస్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనాయి. అనంతరం మరింత పుంజుకుని హైజంప్‌ చేశాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఫలితంగా సెన్సెక్స్‌ 620 పాయింట్లు ఎగిసి 58580 వద్ద,నిఫ్టీ 177పాయింట్ల లాభంతో 17258 వద్ద ఉత్సాహంగా కొనసాగుతోంది.

ప్రధానంగా అదానీ గగ్రూపు షేర్లు  భారీ లాభాల్లో ఉన్నాయి. అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌, అదానీ పోర్ట్స్‌, జేఎస్‌డబ్య్లూ స్టీల్‌, ఐషర్‌ మోటార్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ టాప్‌ గెయినర్స్‌గా కొనసాగుతున్నాయి. మరోవైపు ఏషియన్‌ పెయింట్స్‌, కోల్‌ ఇండియా, దివీస్‌ల్యాబ్స్‌ మాత్రమే నష్టపోతున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement