అక్టోబర్ 1 నుంచి ఆర్​బీఐ కొత్త ఆటో డెబిట్ రూల్స్

New rule on auto-debit transactions from October 1 - Sakshi

ప్రస్తుత ప్రపంచం మొత్తం డిజిటల్ గా మారింది. బ్యాంకుకు వెల్లకుండానే చెల్లింపులు క్షణాలలో జరిగిపోతున్నాయి. చాలా మంది కరెంట్​ బిల్​, టీవీ బిల్లు, ఓటీటీ సబ్​స్క్రిప్షన్​ బిల్లు, ఇతర ఈఎంఐల వంటి వాటికి ఆటో డెబిట్ అనే​​ సదుపాయం వినియోగించుకుంటున్నారు. ఈ ఆటో డెబిట్​​ సదుపాయం వల్ల ఏదైనా బిల్లు గడువు తేదీ మరిచిపోయినా ఆటో మెటిక్ గా సరైనా సమయానికి చెల్లింపులు జరుగుతున్నాయి. అయితే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్​బీఐ) ఈ ఆటో డెబిట్ లావాదేవీల్లో కొన్ని మార్పుల చేసింది.

ఆటో డెబిట్ లావాదేవిలకు సంబంధించి కొత్త నిబంధనలు అక్టోబర్ 1 నుండి అమల్లోకి రానున్నాయి. అక్టోబర్ 1 నుంచి ఆటో డెబిట్ అనే​​ సదుపాయం ఉపయోగించుకోవడం అంత సులభం కాదు. కొత్త నిబందనల ప్రకారం.. క్రెడిట్​, డెబిట్​ కార్డుల ద్వారా ఆటో డెబిట్​ సదుపాయాన్ని వినియోగించుకోవాలంటే.. ఆ పేమెంట్​కు ఓటీపీ అదనపు ధ్రువీకరణ(ఏఎఫ్‌ఏ) అవసరం. రూ.5000 కంటే ఎక్కువ మొత్తానికి ఆటో డెబిట్​ సదుపాయాన్ని వాడుకోవాలంటే ఓటీపీ అదనపు ధ్రువీకరణ(ఏఎఫ్‌ఏ) అవసరమవుతుంది. ఆటో డెబిట్​ తేదీకి కొన్ని రోజుల ముందే లవదేవికి సంబంధించిన సమాచారాన్ని వినియోగదారుడికి బ్యాంకులు పంపిస్తాయి. (చదవండి: లోన్ తీసుకునేవారికి బ్యాంకులు బంపర్ ఆఫర్స్!)

ఆ తర్వాత పేమెంట్​ కొనసాగించాలనుకుంటే ఓటీపీతో ఆ పేమెంట్​ను నిర్ధరించాలి. లేదంటే పేమెంట్​ పూర్తవదు. అప్పుడు మాన్యువల్​గా లావాదేవీని పూర్తి చేయాల్సి ఉంటుంది. అన్ని రకాల క్రెడిట్​, డెబిట్​ కార్డులకు దేశీయ, అంతర్జాతీయ లావాదేవీలకు ఈ రూల్స్​ వర్తిస్తాయి. ఈ కొత్త నిబంధనలు 2021 ఏప్రిల్ నుంచి అమలులోకి రావాల్సి ఉండేది. కానీ, బ్యాంకుల అభ్యర్ధన మేరకు ఆరు నెలలు వాయిదా వేసింది. గడువు తర్వాత ఆర్​బీఐ పేర్కొన్న విధంగా నిబంధనలు పాటించకుంటే చర్యలు తీసుకొనున్నట్లు కూడా స్పష్టం చేసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top