స్వల్ప లాభాలతో- ఐటీ, ఫార్మా అండ | Market open flat- IT, Pharma sectors up | Sakshi
Sakshi News home page

స్వల్ప లాభాలతో- ఐటీ, ఫార్మా అండ

Sep 21 2020 9:45 AM | Updated on Sep 21 2020 9:45 AM

Market open flat- IT, Pharma sectors up - Sakshi

సరిహద్దువద్ద చైనాతో వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు అటూఇటుగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 45 పాయింట్లు బలపడి 38,891ను తాకగా.. 14 పాయింట్ల లాభంతో 11,519 వద్ద నిఫ్టీ ట్రేడవుతోంది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 38,940- 38,803 పాయింట్ల మధ్య ఊగిసలాడగా.. నిఫ్టీ 11,529- 11,492 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. టెక్నాలజీ కౌంటర్లలో అమ్మకాలతో వరుసగా మూడో రోజు శుక్రవారం యూఎస్‌ మార్కెట్లు డీలాపడ్డాయి. ప్రస్తుతం ఆసియాలో మార్కెట్లు మిశ్రమంగా కదులుతున్నాయి. 

ఐటీ స్పీడ్
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా మీడియా ఐటీ, ఫార్మా 1.3-0.7 శాతం మధ్య బలపడగా.. బ్యాంకింగ్‌, ఎఫ్‌ఎంసీజీ 0.5 శాతం చొప్పున బలహీనపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో హెచ్‌సీఎల్‌ టెక్‌ 4 శాతం జంప్‌చేయగా.. టీసీఎస్‌, జీ, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, విప్రో, కొటక్‌ బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం, ఏషియన్‌ పెయింట్స్‌ 2-1  శాతం మధ్య పుంజుకున్నాయి. అయితే బజాజ్‌ ఆటో, సిప్లా, నెస్లే, గెయిల్‌, ఐసీఐసీఐ, ఓఎన్‌జీసీ, ఇన్‌ఫ్రాటెల్‌, పవర్‌గ్రిడ్‌, టాటా మోటార్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌, ఐవోసీ, ఎల్‌అండ్‌టీ, ఇండస్‌ఇండ్‌ 1.5-0.75 శాతం మధ్య నీరసించాయి.
 
డెరివేటివ్స్‌లో..
డెరివేటివ్‌ కౌంటర్లలో బాలకృష్ణ, సన్‌ టీవీ, మణప్పురం, మైండ్‌ట్రీ, అరబిందో, కోఫోర్జ్‌, అపోలో హాస్పిటల్స్‌, వేదాంతా, ఇండిగో, అశోక్‌ లేలాండ్‌ 2.5-1.25 శాతం మధ్య ఎగశాయి. కాగా.. మరోపక్క జిందాల్‌ స్టీల్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, బీవోబీ, బయోకాన్‌, బంధన్‌ బ్యాంక్‌, ఎల్‌ఐసీ హౌసింగ్‌, లుపిన్‌, ఎన్‌ఎండీసీ, ఆర్‌ఈసీ, పిరమల్‌, ఐడీఎఫ్‌సీ ఫస్డ్‌, ఎక్సైడ్‌, పీఎన్‌బీ 2-1 శాతం మధ్య డీలాపడ్డాయి. బీఎస్‌ఈలో స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.4 శాతం బలపడింది. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 938 లాభపడగా.. 850 నష్టాలతో కదులుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement