జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌..డిస్కవరీ కొత్త ఎడిషన్‌ బుకింగ్స్‌ షురూ!

Jaguar Land Rover Discovery opens bookings for Discovery Metropolitan Edition - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ ఇండియా సరికొత్త డిస్కవరీ ఎస్‌యూవీ మెట్రోపాలిటన్‌ ఎడిషన్‌ బుకింగ్స్‌ ప్రారంభించింది.

ధర ఎక్స్‌షోరూంలో రూ.1.26 కోట్ల నుంచి మొదలు. పి360 ఇంజెనియం పెట్రోల్‌ ఇంజన్, డి300 ఇంజెనియం డీజిల్‌ ఇంజన్‌తో రూపుదిద్దుకుంది. 

టాప్‌ వేరియంట్‌కు 31.24 సెంటీమీటర్ల ఇంటెరాక్టివ్‌ డ్రైవర్‌ డిస్‌ప్లే, ఫోన్‌ సిగ్నల్‌ బూస్టర్‌తో వైర్‌లెస్‌ చార్జింగ్, ఫోర్‌ జోన్‌క్లైమేట్‌ కంట్రోల్, హీటెడ్‌ స్టీరింగ్‌ వీల్‌ వంటి హంగులు ఉన్నాయి.

ల్యాండ్‌ రోవర్‌ డిస్కవరీ భారతీయ మార్కెట్లో అత్యంత బహుముఖ ఏడు సీట్ల ఎస్‌యూవీ అని కంపెనీ తెలిపింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top