breaking news
Jaguar Land Rover India Company
-
జాగ్వార్ ల్యాండ్ రోవర్..డిస్కవరీ కొత్త ఎడిషన్ బుకింగ్స్ షురూ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా సరికొత్త డిస్కవరీ ఎస్యూవీ మెట్రోపాలిటన్ ఎడిషన్ బుకింగ్స్ ప్రారంభించింది. ధర ఎక్స్షోరూంలో రూ.1.26 కోట్ల నుంచి మొదలు. పి360 ఇంజెనియం పెట్రోల్ ఇంజన్, డి300 ఇంజెనియం డీజిల్ ఇంజన్తో రూపుదిద్దుకుంది. టాప్ వేరియంట్కు 31.24 సెంటీమీటర్ల ఇంటెరాక్టివ్ డ్రైవర్ డిస్ప్లే, ఫోన్ సిగ్నల్ బూస్టర్తో వైర్లెస్ చార్జింగ్, ఫోర్ జోన్క్లైమేట్ కంట్రోల్, హీటెడ్ స్టీరింగ్ వీల్ వంటి హంగులు ఉన్నాయి. ల్యాండ్ రోవర్ డిస్కవరీ భారతీయ మార్కెట్లో అత్యంత బహుముఖ ఏడు సీట్ల ఎస్యూవీ అని కంపెనీ తెలిపింది. -
జేఎల్ఆర్ ఇవోక్.. కొత్త వేరియంట్.
ముంబై: టాటా మోటార్స్కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా కంపెనీ లగ్జరీ స్పోర్ట్స్ యుటిలిటి వెహికల్ (ఎస్యూవీ) రేంజ్ రోవర్ ఇవోక్లో కొత్త వేరియంట్ను గురువారం మార్కెట్లోకి తెచ్చింది. భారత్లో అసెంబుల్ చేసిన ఈ వేరియంట్ ధరలు రూ.47.1 లక్షల నుంచి రూ.63.2 లక్షల రేంజ్లో ఉన్నాయని కంపెనీ తెలిపింది. లగ్జరీ, స్టైల్, టెక్నాలజీల కలబోతగా ఈ కొత్త వేరియంట్ను రూపొందించామని జేఎల్ఆర్ ఇండియా ప్రెసిడెంట్ రోహిత్ సూరి చెప్పారు. ఈ కొత్త వేరియంట్తో ఇవోక్ జైత్రయాత్ర కొనసాగుతుందన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. గత ఏడాది 2,700 లగ్జరీ వాహనాలు విక్రయించామని, ఈ ఏడాది ఈ సంఖ్య 3,000కు మించుతుందని పేర్కొన్నారు. ఈ కొత్త ఇవోక్ వేరియంట్ ను 2.2 లీటర్ల నాలుగు-సిలిండర్ల టర్బో చార్జ్డ్ డీజిల్ ఇంజిన్తో రూపొందించామని, నాలుగు వేరియంట్లలో లభిస్తుందని తెలిపారు. ప్రత్యేకతలు..: చిన్న ఎల్ఈడీ ఫాగ్ల్యాంప్స్, కొత్త ఎల్ఈడీ టెయిల్ లైట్లు, రూఫ్-లిప్ స్పాయిలర్, ఎల్ఈడీ బ్రేక్ లైట్, ఇన్కంట్రోల్ టచ్ 8-అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 17 స్పీకర్ల 825 వాట్స్ మెరిడియన్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, హెడ్ అప్ డిస్ప్లే వంటి ప్రత్యేకతలున్నాయి.