Har Ghar Tiranga: 10 రోజుల్లో ఎన్ని పతాకాలు కొన్నారో తెలుసా? | Har Ghar Tiranga: over 1 crore national flags sold 10 days | Sakshi
Sakshi News home page

Har Ghar Tiranga: 10 రోజుల్లో ఎన్ని పతాకాలు కొన్నారో తెలుసా?

Aug 12 2022 1:25 PM | Updated on Aug 12 2022 1:31 PM

Har Ghar Tiranga: over 1 crore national flags sold 10 days - Sakshi

న్యూఢిల్లీ: జాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా నిర్వహిస్తున్న హర్‌ఘర్‌ తిరంగా  పిలుపులో కేవలం పది రోజుల్లో  ఆన్‌లైన్‌లో పౌరులకు 1 కోటికి పైగా జాతీయ జెండాలను విక్రయించినట్లు కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. 

పోస్టల్‌ విభాగానికి దేశవ్యాప్తంగా ఉన్న 1.5 లక్షల పోస్టాఫీసుల ద్వారా  జాతీయ జెండాలను విక్రయిస్తోంది. దేశవ్యాప్తంగా ఏ చిరునామాకైనా ఉచిత డోర్‌స్టెప్ డెలివరీని కూడా ఆఫర్‌  చేస్తోంది. ఒక్కో త్రివర్ణ పతాకాన్ని 25 చొప్పున  పౌరులు 1.75 లక్షలకు పైగా జెండాలను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేశారు.  దేశవ్యాప్తంగా 4.2 లక్షల మంది తపాలా ఉద్యోగులు నగరాలు, పట్టణాలు, గ్రామాలతోపాటు, సరిహద్దు ప్రాంతాలలో,  తీవ్రవాదుల ప్రభావిత జిల్లాల్లో పర్వత, గిరిజన ప్రాంతాల్లో సైతం విస్తృతంగా ప్రచారం చేశారని డిఓపి తెలిపింది. ప్రభాత్  భేరీలు,  బైక్ ర్యాలీ చౌపల్స్ సభల ద్వారా, సమాజంలోని ప్రతి వర్గానికి 'హర్ ఘర్ తిరంగా' సందేశాన్ని తీసుకెళ్లామని వెల్లడించింది.

"ప్రభాత్ ఫేరిస్, బైక్ ర్యాలీ మరియు చౌపల్స్ సభల ద్వారా, ఇండియా పోస్ట్ సమాజంలోని ప్రతి వర్గానికి 'హర్ ఘర్ తిరంగా' సందేశాన్ని తీసుకువెళ్లింది. ప్రోగ్రామ్ యొక్క సందేశాన్ని వ్యాప్తి చేయడానికి ట్విట్టర్ మరియు ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా సాధనాలు కూడా విస్తృతంగా ఉపయోగించబడ్డాయి. డిజిటల్‌గా అనుసంధానించబడిన పౌరులు" అని పోస్టల్ శాఖ తెలిపింది.

కాగా 75 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా  ప్రభుత్వం ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ ప్రోగ్రామ్‌ తీసుకొచ్చింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 13 నుంచి 15 వరకు మూడు రోజులు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ పిలుపులో చాలామంది ప్రజలు స్పందిస్తున్నారు. సోషల్‌ మీడియాలో పలు పోస్ట్‌లు, వీడియోలు వైరల్‌ అవుతున్నాయి.

p>

Advertisement
 
Advertisement
Advertisement