
ఇంతింతై.. వటుడింతై అన్న చందాన, బంగారం ధరలు రోజురోజుకి విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ రోజు (ఫిబ్రవరి 20) కూడా పసిడి ధర గరిష్టంగా రూ. 390 పెరిగింది. దీంతో గోల్డ్ రేట్లలో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాలలో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు తెలుసుకుందాం.
హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 80,700 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 88,040 వద్ద నిలిచాయి. నిన్న రూ. 650 (22 క్యారెట్స్ 10 గ్రా), రూ. 700 (24 క్యారెట్స్ 10 గ్రా) పెరిగిన గోల్డ్ రేటు.. ఈ రోజు వరుసగా రూ. 350, రూ. 390 పెరిగింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు వంటి ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.
చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 350, రూ. 390 పెరిగింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 80,700 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 88,040 వద్ద ఉంది. చెన్నైలో నిన్న పసిడి ధర రూ. 650 (22 క్యారెట్స్ 10 గ్రా), రూ. 700 (24 క్యారెట్స్ 10 గ్రా) పెరిగింది.
ఇదీ చదవండి: భారత్లో బంగారం ధరలు ఎవరు నిర్ధారిస్తారు: గోల్డ్ రేటు ఎందుకు పెరుగుతోంది?
దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు మరింత ఊపందుకున్నాయి. ఇక్కడ గోల్డ్ రేట్లు రూ. 80,850 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 88,190 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 400, రూ. 390ఎక్కువ. అంతే కాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు ఎక్కువగానే ఉంది.
వెండి ధరలు (Silver Price)
బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి, కానీ వెండి ధర మాత్రం గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉంది. దీంతో ఈ రోజు (20 ఫిబ్రవరి) కేజీ సిల్వర్ రేటు రూ. 1,08,000 వద్దనే ఉంది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు లక్ష వద్ద ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 1,00,500 వద్ద ఉంది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).