సీడీఎస్‌ఎల్‌ సిస్టమ్‌లో మాల్‌వేర్‌

CDSL detects malware in system - Sakshi

లావాదేవీల సెటిల్మెంట్‌లో జాప్యం

న్యూఢిల్లీ: అంతర్గత సిస్టమ్‌లోని కొన్ని మెషిన్లలో మాల్‌వేర్‌ను కనుగొన్నట్లు డిపాజిటరీ సంస్థ సీడీఎస్‌ఎల్‌ శుక్రవారం వెల్లడించింది.  ఇది లావాదేవీల సెటిల్మెంట్‌లో జాప్యానికి దారి తీసినట్లు పేర్కొంది. అయితే, ఇన్వెస్టర్ల డేటా లేదా గోప్యనీయ సమాచారమేదీ చోరీ అయి ఉండకపోవచ్చని తెలిపింది.

ముందు జాగ్రత్త చర్యగా మార్కెట్లోని మిగతా సంస్థల నుండి సిస్టమ్‌లను డిస్‌కనెక్ట్‌ చేసినట్లు సీడీఎస్‌ఎల్‌ వివరించింది. సంబంధిత ప్రాధికార సంస్థలకు ఈ ఉదంతాన్ని రిపోర్ట్‌ చేశామని, దీని ప్రభావాలను అధ్యయనం చేసేందుకు సైబర్‌ సెక్యూరిటీ సలహాదారులతో కలిసి పని చేస్తున్నట్లు తెలిపింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top