
హైదరాబాద్: మలబద్ధకానికి ఔషధంగా గత 50 సంవత్సరాలుగా మార్కెట్లో ఉన్న తమ ప్రతిష్టాత్మక ‘కాయం చూర్ణ’ ఇక గ్రాన్యూల్స్ (గుళికలు లేదా పలుకులు) రూపంలోనూ అందుబాటులోనికి రానుందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. (వివో ఎక్స్ 90, 90ప్రొ స్మార్ట్ఫోన్లు లాంచ్, ధరలు చూస్తే)
ఈ అడ్వాన్స్డ్ ఫార్ములా వల్ల చూర్ణ గొంతులో అతుక్కుపోవడం, అసౌకర్యం వంటి సమస్యలు తొలగిపోతాయని భావ్నగర్ కేంద్రంగా ఈ ఉత్పత్తిలో ఉన్న సేథ్ బ్రదర్స్ సంస్థ వివరించింది. జీలకర్ర రుచితో ఉండే ఈ కొత్త ప్రొడక్ట్ కడుపును శుద్ధి చేయడానికి మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని ప్రకటన పేర్కొంటూ.. ఆముదం, గులాబీ ఆకుల మేళవింపుతో ప్రొడక్ట్ రూపొందడం దీనికి కారణమని వివరించింది. (ముంబై ఇండియన్స్ బాస్ గురించి తెలుసా? అంబానీని మించి సంపాదన)