సీజనల్‌ జ్వరాలు ప్రబలకుండా చర్యలు | - | Sakshi
Sakshi News home page

సీజనల్‌ జ్వరాలు ప్రబలకుండా చర్యలు

Jun 12 2026 12:11 AM | Updated on Jun 12 2026 12:11 AM

మణుగూరు రూరల్‌/భద్రాచలం అర్బన్‌ : సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ తుకారాం రాథోడ్‌ సూచించారు. మణుగూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం నిర్వహించిన ఆశా డే కార్యక్రమంలో పాల్గొన్నారు. భద్రాచలం అడిషనల్‌ డీఎంహెచ్‌ఓ కార్యాలయం, మలేరియా డ్రగ్‌ స్టోర్స్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాతా, శిశు ఆరోగ్య పరిరక్షణలో ఆశా కార్యకర్తల సేవలు ఎంతో కీలకమైనవని అన్నారు. వర్షాకాలంలో వచ్చే డెంగీ, మలేరియా, చికున్‌గున్యా వంటి సీజనల్‌ జ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ వేయాలన్నారు. మలేరియా మాసోత్సవాలను, ఈ నెల 28న నిర్వహించే పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఏసీఎం, స్టిరప్‌ పంపులు, ఫాగింగ్‌ మెషిన్ల వివరాలను అందించాలన్నారు. అధికారులు ప్రతాప్‌, హరీష్‌, శ్రీధర్‌, పాయం శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, మోహన్‌ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

డీఎంహెచ్‌ఓ తుకారాం రాథోడ్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement