724 మె.టన్నుల యూరియా | - | Sakshi
Sakshi News home page

724 మె.టన్నుల యూరియా

Jun 12 2026 12:11 AM | Updated on Jun 12 2026 12:11 AM

చింతకాని: మండలంలోని పందిళ్లపల్లి రేక్‌ పాయింట్‌కు గురువారం స్పిక్‌ కంపెనీకి చెందిన 724.05 మెట్రిక్‌ టన్నుల యూరియా చేరిందని జిల్లా వ్యవసాయాధికారి డి.పుల్లయ్య తెలిపారు. ఇందులో ఖమ్మం జిల్లాకు 224.05 మెట్రిక్‌ టన్నులు, భద్రాద్రి జిల్లాకు 300 మె.టన్నులు, మహబూబాబాద్‌ జిల్లాకు 200 మె.టన్నులు సరఫరా చేశామని వెల్లడించారు.

బీసీ స్టడీ సర్కిల్‌లో శిక్షణ పూర్తి

ఖమ్మంమయూరిసెంటర్‌: ఖమ్మంలోని బీసీ స్టడీ సర్కిల్‌లో నాలుగు రోజులుగా ఏఐ, లైఫ్‌ స్కిల్స్‌పై ఇస్తున్న శిక్షణ గురువారం ముగిసింది. ఈ సందర్భంగా శిక్షణలో పాల్గొన్న 139 మంది అభ్యర్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, కమ్యూనికేషన్‌, నాయకత్వ లక్షణాలపై నిపుణులతో శిక్షణ ఇప్పించినట్లు నిర్వాహకులు తెలిపారు. కాగా, గురువారం జరిగిన కార్యక్రమంలో డీబీసీడీఓ జి.జ్యోతి అభ్యర్థులకు సర్టిఫికెట్లను అందజేసి మాట్లాడారు. శిక్షణ పొందిన వారు సాంకేతికత ఆధారంగా జీవనోపాధికి బాటలు వేసుకోవాలని సూచించారు. బీసీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ జి.శ్రీలత, అక్షిత, ఏబీసీడీఓ వెంగళ్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement