హామీల సాధన కోసం దశల వారీ పోరాటం | - | Sakshi
Sakshi News home page

హామీల సాధన కోసం దశల వారీ పోరాటం

Jan 28 2026 7:04 AM | Updated on Jan 28 2026 7:04 AM

హామీల సాధన కోసం దశల వారీ పోరాటం

హామీల సాధన కోసం దశల వారీ పోరాటం

గుంటూరు ఎడ్యుకేషన్‌: కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీల సాధన కోసం రాష్ట్రోపాధ్యాయ సంఘ (ఎస్టీయూ) చేపట్టిన పోరాటాన్ని విజయవంతం చేయాలని ఏఐఎస్టీఎఫ్‌ జాతీయ ఆర్థిక కార్యదర్శి సీహెచ్‌ జోసఫ్‌ సుధీర్‌ బాబు పిలుపునిచ్చారు. మంగళవారం గుంటూరులో పోరాట కార్యక్రమ కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా సుధీర్‌బాబు మాట్లాడుతూ అధికారంలోకి రాగానే పీఆర్సీ కమిటీ ఏర్పాటుతోపాటు సీపీఎస్‌కు ప్రత్యామ్నాయంగా రోడ్‌మ్యాప్‌ ప్రకటించి, రూ.34 వేల కోట్ల పెండింగ్‌ బకాయిలను చెల్లిస్తామని చంద్రబాబు ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్నా ఆ ఊసే లేదన్నారు. అందుకే దశల వారీ ఉద్యమానికి ఎస్టీయూ పిలుపు ఇచ్చిందన్నారు. ఈనెల 30న మండల స్థాయిలో తహసీల్దార్లకు మెమొరాండం సమర్పించే కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఎస్టీయూ కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement