పరిశ్రమలకే ‘కొమ్ము’మూరు లిఫ్ట్‌ | - | Sakshi
Sakshi News home page

పరిశ్రమలకే ‘కొమ్ము’మూరు లిఫ్ట్‌

Nov 24 2025 8:06 AM | Updated on Nov 24 2025 8:06 AM

పరిశ్రమలకే ‘కొమ్ము’మూరు లిఫ్ట్‌

పరిశ్రమలకే ‘కొమ్ము’మూరు లిఫ్ట్‌

సాక్షి ప్రతినిధి, బాపట్ల: కొమ్మమూరు ఎత్తిపోతల విషయం బయటకు రాగానే బాపట్ల, పర్చూరు, చీరాల ప్రాంత రైతులు ఆందోళన చెందారు. సమావేశాలు పెట్టి ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండించారు. దిగువ ఆయకట్టు రైతుల పొట ్టకొట్టవద్దని ప్రభుత్వానికి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, సాగునీటి విభాగం సెక్రటరీ, ఇతర ఉన్నతాధికారులకు విన్నవించారు. 60వ కిలోమీటరు వద్ద ఎత్తిపోతల పథకం పెట్టి నీటిని ఎత్తిపోస్తే దిగువన 1.20 లక్షల ఎకరాల ఆయకట్టుతోపాటు బాపట్ల, చీరాల మున్సిపాలిటీలేకాక 50 గ్రామాలకు తాగునీటి సమస్య తలెత్తుతుందని తెలిపారు. తద్వారా 6 లక్షల జనాభాకు నీటి కష్టాలు తప్పవని వివరించారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో చివరి ఆయకట్టుకు సక్రమంగా నీరందక ఏటా కాలువల్లో ఆయిల్‌ ఇంజిన్లు పెట్టి నీటిని తోడుకుంటున్నట్లు గుర్తుచేశారు. లిఫ్ట్‌ పెట్టి 120 హెచ్‌పీ హైస్పీడ్‌ మోటార్లతో 48.39 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తే దిగువకు నీరొచ్చే పరిస్థితి ఉండదని వాపోతున్నారు. అడ్డుకోవాలని బాపట్ల, చీరాల, పర్చూరు ఎమ్మెల్యేలతోపాటు మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావులపైనా ఒత్తిడి పెంచారు. అయినా చంద్రబాబు ప్రభుత్వం వెనక్కు తగ్గలేదు. కాస్త మార్చి ముందుకు... గతంలో 60వ కిలోమీటరు వద్ద కాకుండా 58వ కి.మీ. వద్ద ఎత్తిపోతల నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అధికారులు రెండు రోజుల క్రితం ప్రభుత్వానికి కొత్త డీపీఆర్‌ సమర్పించినట్లు సమాచారం. పరిశ్రమలు పెట్టబోయే వారు పలుకుబడి ఉన్న వారు కావడంతో పథకం ఆగే అవకాశం లేదని కీలక అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే దీనిపై బాపట్ల, చీరాల, పర్చూరు ఎమ్మెల్యేలతో వారు మాట్లాడుకున్నట్లు ప్రచారం ఉంది. ఈ కారణంగానే ప్రజాప్రతినిధులు నోరు కూడా మెదపడం లేదన్న విమర్శలున్నాయి.

మభ్యపెట్టేలా హామీలు

రైతులను మభ్యపెట్టేందుకు కొమ్మమూరు కాలువలో నీటిని వాడుకున్నందుకు ప్రతిగా సమీపంలోని నల్లమడ డ్రైన్‌ నుంచి అంతే మొత్తంలో మురుగునీటిని రూ.12 కోట్లతో నిర్మించే మరో లిఫ్ట్‌ ద్వారా కొమ్మమూరులోకి ఎత్తిపోస్తామని చెబుతోంది. వాస్తవానికి నల్లమడ నీరు మురుగునీరు. ఎగువ ప్రాంతాలైన నరసరావుపేట, చిలుకలూరిపేట పట్టణాలు, ఇతర అన్ని గ్రామాల డ్రైనేజీ నీరు వస్తుంది. పరిశ్రమల వ్యర్థాలు కూడా ఈ డ్రైన్‌లో కలుస్తాయి. సముద్రపు నీరు కూడా ఇందులో చేరి నీరు విషతుల్యంగా మారి పంటలకు, తాగునీటి అవసరాలకు పనికి రావడం లేదు. ఇక్కడ పరిశ్రమలు నిర్మించే పారిశ్రామికవేత్తలకు, ఈ పథకానికి సూత్రధారిగా ఉన్న గుంటూరు సర్కిల్‌ ఇరిగేషన్‌ అధికారికి ఈ విషయం తెలియంది కాదు. దిగువ రైతుల నుంచి వ్యతిరేకత రాకుండా ఈ ప్రతిపాదన తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. నల్లమడ డ్రైన్‌ నీరు నిజంగానే బాగుంటే అక్కడే ఎత్తిపోతల పథకం నిర్మించుకోవాలని దిగువ ఆయకట్టు రైతులు సూచిస్తున్నారు. ఏటా నల్లమడలో 40 టీఎంసీలకుపైగా నీటి లభ్యత ఉన్నందున రూ. 12 కోట్లతో పథకం పూర్తవుతుందని, ప్రజాధనం దుర్వినియోగం కాదన్నారు. సర్కారు తీరు మారకుంటే ఆందోళన చేస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు.

దిగువ రైతుల ప్రయోజనాలకు గండి

ఫిర్యాదులు అందినా మారని

చంద్రబాబు ప్రభుత్వం

అంచనాలను సర్కారు

ముందుంచిన అధికారులు

6 లక్షల మందికి తాగునీటి

కష్టాలు తలెత్తే అవకాశం

కొమ్మమూరు కాలువపై గుంటూరు జిల్లా చినకాకుమాను వద్ద రూ. 22.88 కోట్లతో ఎత్తిపోతల పథకం నిర్మించాలన్న చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయం మరింత వివాదాస్పదంగా మారుతోంది. ఈ పథకం రైతుల అవసరాల కోసం కాకుండా అక్కడ ఏర్పాటు చేయబోయే పరిశ్రమలకు నీటిని తరలించేందుకేనన్న ప్రచారం జోరుగా సాగుతోంది. చంద్రబాబు ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలున్న కొందరు పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసమే ఇలా చేస్తున్నట్లు అధికారవర్గాల నుంచే సమాచారం వస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement