స్కూల్‌ గేమ్స్‌ కార్యదర్శి నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

స్కూల్‌ గేమ్స్‌ కార్యదర్శి నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

Aug 18 2025 6:01 AM | Updated on Aug 18 2025 6:01 AM

స్కూల

స్కూల్‌ గేమ్స్‌ కార్యదర్శి నియామకానికి దరఖాస్తుల ఆహ్వా

పులిచింతలకు 2,04,138 క్యూసెక్కులు విడుదల

గుంటూరు ఎడ్యుకేషన్‌: గుంటూరు జిల్లా స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ కార్యనిర్వాహక కార్యదర్శి నియామకం కోసం ఆసక్తి, అర్హత కలిగిన వ్యాయామ ఉపాధ్యాయులు ఈనెల 20లోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ విడుదల చేసిన విధి, విధానాల ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో 10 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన పీఈటీలు, స్కూల్‌ అసిస్టెంట్లు (ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌) పూర్తి వివరాలతోపాటు నమూనా దరఖాస్తును డీఈవో గుంటూరు బ్లాగ్‌స్పాట్‌.కామ్‌ సైట్‌లో సందర్శించాలని సూచించారు. పూర్తి చేసిన దరఖాస్తులను జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంతో అందజేయాలని తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి

తెనాలి రూరల్‌: తెనాలి సుల్తానాబాద్‌లో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. అంగలకుదురులో కిరాణా షాపు నిర్వహించే పువ్వాడ సుబ్బారావు(72) రోడ్డుపై నడుచుకుంటూ తెనాలి నుంచి అంగలకుదురు వైపు వెళ్తుండగా గుర్తు తెలియని కారు వేగంగా ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదంలో సుబ్బారావు తీవ్రంగా గాయపడగా, తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. త్రీ టౌన్‌ పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సత్రశాల(రెంటచింతల): మండలంలోని సత్రశాల వద్ద నున్న నాగార్జునసాగర్‌ టెయిల్‌ పాండ్‌ విద్యుత్‌ ప్రాజెక్టు రిజర్వాయర్‌ 11 క్రస్ట్‌ గేట్ల ద్వారా 2,04,138 క్యూసెక్కులు పులిచింతలకు విడుదల చేసినట్లు ప్రాజెక్టు ఎస్‌ఈ వెంకటరమణ, ఈఈ సుబ్రహ్మణ్యం ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టెయిల్‌ పాండ్‌ ప్రాజెక్టు రిజర్వాయర్‌ 11 క్రస్ట్‌ గేట్లు 3.5 మీటర్లు ఎత్తు ఎత్తి 2,04,138 క్యూసెక్కులు దిగువనున్న పులిచింతల ప్రాజెక్ట్‌కు విడుదల చేస్తున్నట్లు వారు తెలిపారు. ప్రాజెక్టు నీటిమట్టం 75.50 మీటర్లకుగాను 75.33 మీటర్లకు నీరు చేరుకుందన్నారు. రిజర్వాయర్‌ గరిష్ట నీటి సామర్థ్యం 7.080 టీఎంసీలకు గాను ప్రస్తుతం 6.963 టీఎంసీలు నిల్వ ఉందన్నారు. టీఆర్‌సీ లెవల్‌ 59.80 మీటర్లకు చేరుకుందన్నారు. ఎగువ నున్న నాగార్జునసాగర్‌ నుంచి 1,99,781 క్యూసెక్కులు ప్రాజెక్టుకు చేరుకుంటుందన్నారు. ప్రస్తుతం విద్యుత్‌ ప్రాజెక్టులోని రెండు యూనిట్ల ద్వారా విద్యుత్‌ ఉత్పత్తిని నిలిపివేసినట్లు వెల్లడించారు. నాగార్జునసాగర్‌ నుంచి వచ్చే వరదను బట్టి దిగువనున్న పులిచింతలకు నీటిని విడుదల చేస్తామన్నారు.

స్కూల్‌ గేమ్స్‌ కార్యదర్శి నియామకానికి  దరఖాస్తుల ఆహ్వా1
1/1

స్కూల్‌ గేమ్స్‌ కార్యదర్శి నియామకానికి దరఖాస్తుల ఆహ్వా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement