సారా రహిత జిల్లాగా పల్నాడు | - | Sakshi
Sakshi News home page

సారా రహిత జిల్లాగా పల్నాడు

Jun 17 2025 5:05 AM | Updated on Jun 17 2025 5:05 AM

సారా రహిత జిల్లాగా పల్నాడు

సారా రహిత జిల్లాగా పల్నాడు

నరసరావుపేట: సారా రహిత జిల్లాగా పల్నాడు జిల్లా ఏర్పాటైందని జిల్లా కలెక్టర్‌ పి.అరుణ్‌బాబు ప్రకటించారు. కలెక్టర్‌ కార్యాలయంలో ప్రోహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ శాఖ అధికారులు, ఇతర శాఖల అధికారులతో కలెక్టర్‌ సోమవారం సాయంత్రం సమా వేశం నిర్వహించారు. తొలుత జిల్లాలో ప్రభుత్వం మార్గదర్శకాలు మేరకు నాటుసారా నిర్మూలనకు చేపట్టిన చర్యలను ఎకై ్సజ్‌ అధికారులు కలెక్టర్‌కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడు తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నవోదయం 2.0లో భాగంగా జిల్లాలో నాటుసారా నిర్మూలనకు ప్రోహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ శాఖ ఆధ్వర్యంలో పటిష్ట చర్యలు చేపట్టినట్టు చెప్పారు. నాటుసారా నిర్మూలనలో భాగంగా మొదటి దశలో 116 అవగాహన సదస్సులు నిర్వహించి దానివలన కలిగే దుష్ప్రభావాలపై ప్రచారరథంతో ఊరురా తిరుగుతూ ప్రచారం నిర్వహించారన్నారు. రెండవ దశలో విస్తృతంగా దాడులు నిర్వహించి తయారీ విక్రయాల్లో ఉన్న వారిపై 32 కేసులు నమోదు చేసి 21 మందిని అరెస్టు చేయగా 138 లీటర్ల సారా స్వాధీనం చేసుకొని 11,400 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేశారన్నారు. బెల్లం విక్రయించకుండా చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. ఇప్పటికీ ఆయా ప్రాంతాల్లో సారా వృత్తిగా బతుకుతున్న వారికి చైతన్యం కల్పించి ప్రత్యామ్నాయంగా ఉపాధి కల్పించేందుకు కలెక్టర్‌ సూచనల ప్రకారం 57 మందిని గుర్తించి అందులో అర్హులుగా గుర్తించిన 23 మందికి ప్రత్యామ్నయంగా వారి కుటుంబాలకు రూ.29.40 లక్షలు మొత్తాన్ని కలెక్టర్‌ చేతుల మీదుగా ఉపాధి, లోన్‌ రూపంలో అందజేశారు. గుంటూరు ప్రొహిబిషన్‌ ఎకై ్సజ్‌ డెప్యూటీ కమిషనర్‌ కె.శ్రీనివాసరావు, అసిస్టెంట్‌ కమిషనర్లు ఎం.సుధాకర్‌రెడ్డి, ఎం.రవికుమార్‌రెడ్డి, పల్నాడు జిల్లా ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ కె.మణికంఠ, అసిస్టెంట్‌ ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ జి.సూర్యనారాయణ, కె.రవీంద్ర పాల్గొన్నారు.

నవోదయం 2.0తో పటిష్టమైన చర్యలు

ఎకై ్సజ్‌ అధికారులతో సమీక్షలో కలెక్టర్‌

రూ.29.40 లక్షల ఆర్థిక సహాయం అందజేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement