
డయేరియా నివారణపై అవగాహన కల్పించండి
తెనాలి టౌన్: ఐదు సంవత్సరాల్లోపు చిన్నారులకు వచ్చే డయోరియాపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించి, నివారణ పద్ధతులు తెలియజేయాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు. ఆదివారం ఆయన తెనాలి కార్యాలయంలో డయేరియా నివారణ అవగాహన పోస్టర్ విడుదల చేశారు. జూన్ 16 నుంచి జులై 31వ తేదీ వరకు ఆరోగ్య సిబ్బంది ఇంటింటా అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. ఐదు సంవత్సరాల్లోపు చిన్నారులకు ఓఆర్ఎస్, జింక్ ట్యాబ్లెట్లను పంపిణీ చేయాలని ఆదేశించారు. ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు సమగ్రంగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య మౌళిక సదుపాయాల సంస్థల చిల్లపల్లి శ్రీనివాసరావు, గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, జిల్లా వ్యాధి నిరోధక టీకా అధికారి డాక్టర్ అమర్తలూరు శ్రావణ్బాబు, తెనాలి డెప్యూటీ డీఎం అండ్ హెచ్వో డాక్టర్ ఈ.అన్నపూర్ణ, డాక్టర్ వేముల ప్రియాంక, అందె బాలచంద్రమౌళి, వి.సీతారామశాస్త్రి, 104 జిల్లా మేనేజర్ ఎం.రాఘవకుమార్ పాల్గొన్నారు.
వైద్య, ఆరోగ్యశాఖ
మంత్రి సత్యకుమార్ యాదవ్