
యోగా మహోత్సవం
నేడు కొండవీడులో
యడ్లపాడు: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని (జూన్ 21) పురస్కరించుకుని యోగా ప్రాధాన్యత క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికీ తెలిసేలా జిల్లా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పిల్లల నుంచి వృద్ధుల వరకు యోగాపై అవగాహన కల్పిస్తూ..జిల్లా వ్యాప్తంగా యోగాపై వివిధ రకాల పోటీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రం నరసరావుపేటలో మంగళవారం ప్రతి మండలానికి ముగ్గురు చొప్పున విద్యార్థులకు జిల్లాస్థాయిలో యోగా సాధనపై పోటీలు జరిగాయి. కొండవీడుకోట వేదికగా బుధవారం ప్రత్యేక యోగా కార్యక్రమం నిర్వహించనున్నారు. కొండవీడు కోట ఘాట్రోడ్డు ప్రారంభంలోని చెక్పోస్టు వద్ద ఉదయం 6 గంటల నుంచి గంటన్నరపాటు యోగా ప్రదర్శన జరగనుంది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పి. అరుణ్బాబు, జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు, వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, డ్వాక్రా సంఘాల మహిళలు, యువత తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. దీంతో ఘాట్రోడ్డు ప్రాంతంలో యోగాభ్యాసానికి వేదిక, కార్యక్రమానికి వచ్చే వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాలను శుభ్రం చేయించి సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో చివరిగా ఈనెల 18వ తేదీన అమరావతిలోని జ్ఞానబుద్ధ ప్రాంతంలో నిర్వహించనున్నారు.
ఘాట్రోడ్డు వేదికగా ‘యోగాంధ్ర 2025’ ప్రత్యేక కార్యక్రమం కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహణకు ఏర్పాట్లు