తొలి విడత బస్సు యాత్ర విజయవంతం: వైవీ సుబ్బారెడ్డి | Yv Subba Reddy About Second Phase Ysrcp Bus Yatra | Sakshi
Sakshi News home page

తొలి విడత బస్సు యాత్ర విజయవంతం: వైవీ సుబ్బారెడ్డి

Nov 15 2023 11:09 AM | Updated on Nov 15 2023 11:24 AM

Yv Subba Reddy About Second Phase Ysrcp Bus Yatra - Sakshi

తొలి విడత సామాజిక సాధికార బస్సు యాత్ర విజయవంతమైందని వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర సమన్వయ కర్త వైవీ సుబ్బారెడ్డి అన్నారు.

సాక్షి, విశాఖపట్నం: తొలి విడత సామాజిక సాధికార బస్సు యాత్ర విజయవంతమైందని వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర సమన్వయ కర్త వైవీ సుబ్బారెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, 175 నియోజకవర్గాల్లో ఈ నెల 30 వరకు రెండో విడత బస్సు యాత్ర జరగనుందన్నారు. ఇవాళ నరసన్నపేట నుంచి రెండో విడత యాత్ర మొదలవుతుందన్నారు.

నాలుగున్నరేళ్లుగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు ప్రజల దృష్టికి తీసుకువెళ్తామన్నారు. 70 శాతం పథకాలు బీసీ,ఎస్టీ, ఎస్సీ సామాజిక వర్గాలకు ఈ ప్రభుత్వం అందించిందన్నారు.

‘‘సామాజిక సాధికార యాత్రలో నాడు-నేడు పనులను పరిశీలిస్తున్నాం. ఎక్కడైనా లోపాలుంటే సరి చేయాలని చెబుతున్నాం. జనసేన నాయకుల విమర్శలకు సమాధానం ఇవ్వాల్సిన పనిలేదు. నాడు-నేడుపై బురద జల్లే పనిలో జనసేనలో ఉంది. ఎన్ని పార్టీలు కలిసినా రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీదే విజయం’’ అని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
చదవండి: టీడీపీ ఖాతాలోకి రూ.27 కోట్ల స్కిల్‌ స్కామ్‌ నిధులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement