నేడు సీఎం వైఎస్‌ జగన్‌ విజయవాడ పర్యటన  | YS Jaganmohan Reddy to visit Vijayawada on january 26 | Sakshi
Sakshi News home page

నేడు సీఎం వైఎస్‌ జగన్‌ విజయవాడ పర్యటన 

Jan 26 2024 5:20 AM | Updated on Jan 26 2024 6:28 AM

YS Jaganmohan Reddy to visit Vijayawada on january 26 - Sakshi

సాక్షి, అమరావతి: సీఎం జగన్‌ శుక్రవారం విజయవాడలో పర్యటించనున్నారు. ఉద యం 8.50 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియానికి చేరు­కుంటారు. గణతంత్ర దినోత్సవంలో పాల్గొన్న అనంతరం తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. సాయంత్రం 4.15 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ఆతిథ్యం ఇచ్చే హై టీ కార్యక్రమంలో పాల్గొంటారు.   

రేపు విశాఖ జిల్లా భీమిలిలో పర్యటన 
సీఎం జగన్‌ శనివారం విశాఖ జిల్లా భీమిలిలో పర్యటించనున్నారు. వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర రీజియన్‌ బహిరంగ సభలో పాల్గొంటారు. ఇందుకోసం సీఎం శనివారం మధ్యా­హ్నం 1.45 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి భీమిలి నియోజకవర్గం సంగివలసలో జరిగే వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర రీజియన్‌ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం తాడేపల్లికి చేరుకుంటారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement