సాక్షి,తాడేపల్లి: మహాకవి యోగి వేమన జయంతి సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాళులు అర్పించారు. ఈ మేరకు వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
ఆ ట్వీట్లో యోగి వేమన పద్యాలు కేవలం పద్యాలు మాత్రమే కాదు… అవి జీవిత సత్యాలు. మనిషి ఆత్మపరిశీలనకు, జీవన ప్రయాణానికి ఆ పద్యాలు వెలుగు రేఖలు . “మేడిపండు చూడ మేలిమైయుండు”, “ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు”, “ఆత్మశుద్ధి లేని ఆచారమేల” అంటూ మనిషి మారితేనే సమాజం మారుతుందని శతాబ్దాల క్రితమే చెప్పిన వేమన జయంతి సందర్భంగా ఆ మహనీయుడిని స్మరించుకుంటూ హృదయపూర్వక నివాళులు’అని పేర్కొన్నారు.
యోగి వేమన పద్యాలు కేవలం పద్యాలు మాత్రమే కాదు… అవి జీవిత సత్యాలు. మనిషి ఆత్మపరిశీలనకు, జీవన ప్రయాణానికి ఆ పద్యాలు వెలుగు రేఖలు . “మేడిపండు చూడ మేలిమైయుండు”, “ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు”, “ఆత్మశుద్ధి లేని ఆచారమేల” అంటూ మనిషి మారితేనే సమాజం మారుతుందని శతాబ్దాల క్రితమే… pic.twitter.com/XuHxEsujkp
— YS Jagan Mohan Reddy (@ysjagan) January 19, 2026



