
గుంటూరు, సాక్షి: మిలాద్-ఉన్-నబీని నేడు దేశవ్యాప్తంగా అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో.. వైస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రతి ఒక్కరూ ఎదుటివారిపట్ల ప్రేమ, కరుణ కలిగి ఉండాలన్న మహ్మద్ ప్రవక్త బోధనలు మానవాళికి సదా అనుసరణీయం. నేడు ఆయన జన్మదిన సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు అని ఎక్స్ ఖాతాలో సందేశం ఉంచారాయన.
ప్రతి ఒక్కరూ ఎదుటివారిపట్ల ప్రేమ, కరుణ కలిగి ఉండాలన్న మహ్మద్ ప్రవక్త బోధనలు మానవాళికి సదా అనుసరణీయం. నేడు ఆయన జన్మదినం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు.
— YS Jagan Mohan Reddy (@ysjagan) September 16, 2024
