
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వెనక్కి తీసుకోవాలంటూ స్టీల్ప్లాంట్ కార్మికులు బుధవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. స్టీల్ప్లాంట్ మెయిన్గేట్ నుంచి రైల్వే డీఆర్ఎమ్ కార్యాలయం వరకు ర్యాలీ జరిగింది. అలాగే, కార్మికులు డీఆర్ఎమ్ కార్యాలయం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు పాదయాత్ర తీశారు.