48 గంటల్లోనే వారి ఖాతాల్లోకి రూ.5 వేలు: విజయసాయిరెడ్డి

Vijaya Sai Reddy Comments On YSR Arogya Asara Scheme - Sakshi

సాక్షి, అమరావతి: పేద, మధ్యతరగతి ప్రజలు ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం పొందాక కోలుకునే సమయంలో వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా పథకం అండగా నిలుస్తోందని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు తన ట్విటర్‌ ఖాతాలో.. 'గత పది నెలల్లో 134 కోట్ల వ్యయంతో 2.10 లక్షల మందికి ఆరోగ్య ఆసరా. ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం పొందాక కోలుకునే సమయలో అండ. డిశ్చార్జైన 48 గంటల్లోనే వారి ఖాతాల్లోకి రూ.5 వేలు. కుటుంబ పెద్ద కోలుకునే సమయంలో పెద్దదిక్కుగా మారిందీ వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా. జగన్ గారి ముందు చూపునకు మచ్చుతునక' అంటూ ప్రశంసలు గుప్పించారు. (సీఎం జగన్‌ దూరదృష్టికి సలాం)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top