సీఎం జగన్‌ ప్రస్తావించిన అంశాలపై సానుకూలంగా స్పందించిన అమిత్‌ షా | Southern Zonal Council Meeting Tirupati Amit Shah Comments | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ ప్రస్తావించిన అంశాలపై సానుకూలంగా స్పందించిన అమిత్‌ షా

Nov 14 2021 7:42 PM | Updated on Nov 14 2021 8:03 PM

Southern Zonal Council Meeting Tirupati Amit Shah Comments - Sakshi

ట్రైబల్‌ యూనివర్శిటీ ఏర్పాటు స్థలం మార్పును నోటిషికేషన్‌ ద్వారా ప్రకటించాలన్న సీఎం జగన్‌ విజ్ఞప్తికి అమిత్‌ షా అంగీకరించారు

సాక్షి, అమరావతి: దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రస్తావించిన అంశాలపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సానుకూలంగా స్పందించారు. ఏపీ, తెలంగాణ మధ్య ఆస్తుల విభజనకు సంబంధించి నెల రోజుల్లో కార్యాచరణ సిద్ధం చేయాలని అమిత్‌ షా ఆదేశించారు. ట్రైబల్‌ యూనివర్శిటీ ఏర్పాటు స్థలం మార్పును నోటిషికేషన్‌ ద్వారా ప్రకటించాలన్న సీఎం జగన్‌ విజ్ఞప్తికి అమిత్‌ షా అంగీకరించారు. 
(చదవండి: ‘విభజనతో భారీగా నష్టపోయాం.. ఏడేళ్లు​ గడిచినా హమీలు అమలు కాలేదు’)

అలానే ఏపీ ప్రస్తావించిన గ్రేహౌండ్స్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ఏర్పాటు అంశంపై అమిత్‌ షా స్పందిస్తూ.. భూమిని ఇస్తే.. ఖర్చు తామే భరించి సెంటర్‌ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement