సాక్షి, తిరుపతి: తిరుమల దేవస్థానంలో మరోసారి భద్రతా వైఫల్యం బయిటపడింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి కొంతమంది భక్తులు సెల్ఫోన్లు తీసుకెళ్లారు. కంపార్ట్మెంట్లోని పరిస్థితులపై వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో తనిఖీల్లో టీటీడీ విజిలెన్స్ అధికారుల నిర్లక్షం స్పష్టంగా బహిర్గతమైంది. సోషల్ మీడియాలో ఈ పోస్టులు చూసిన భక్తులు తిరుమల పవిత్ర క్షేత్రంలో సెల్ఫోన్లు ఎలా అనుమతించారంటూ భక్తులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.


