నకిలీ మద్యం సూత్రధారులు ప్రభుత్వ పెద్దలే | Satish Reddy Satirical Comments On Chandrababu Over Fake Liquor Manufacturing | Sakshi
Sakshi News home page

నకిలీ మద్యం సూత్రధారులు ప్రభుత్వ పెద్దలే

Oct 6 2025 3:43 AM | Updated on Oct 6 2025 3:43 AM

Satish Reddy Satirical Comments On Chandrababu Over Fake Liquor Manufacturing

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్‌కుమార్‌రెడ్డి

ఇది ముమ్మాటికీ ప్రభుత్వ ప్రాయోజిత దందానే

సీఎం చంద్రబాబు దీనికి సమాధానం చెప్పాలి

సాక్షి, అమరావతి: అన్నమయ్య జిల్లా ములకల­చెరువు వద్ద భారీగా పట్టుబడ్డ నకిలీ మద్యం తయారీ వెనుక ఉన్నది ముమ్మాటికీ ప్రభు­త్వ పెద్దలేనని, ఇది ముమ్మాటికీ ప్రభుత్వ ప్రాయోజిత దందానేనని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి స్పష్టంచేశారు. హైదరా­బాద్‌ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక టీడీపీ నేత సురేంద్రనాయుడు పాత్రధారి మాత్రమే­నని, దీని వెనుక ఉన్న అసలు సూత్రధారులను బయట­పెట్టా­లని.. సీఎం చంద్రబాబు ఈ దందాకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..

నాణ్యమైన మద్యం అంటే ఇదేనా!?..
ప్రభుత్వ పెద్దల అండదండలు లేకుండా హైవే పక్కనే ఓ పరిశ్రమను తలపించేలా నకలి మద్యా­న్ని ఎలా తయారు చేయగలరు? ఈ ప్రభుత్వ పెద్దలు గత ఎన్నికల్లో చేసిన వాగ్దానాలేంటి? అధికారంలోకి వచ్చాక చేస్తున్న దుర్మార్గాలేంటి? నాణ్యమైన మద్యం అంటే ఇదేనా!? ఏ బ్రాండ్‌ కావాలంటే ఆ బ్రాండ్‌తో రోజుకు 30 వేల క్వార్టర్‌ బాటిళ్లు తయారుచేసి, మద్యం షాపులకు, బెల్టు షాపులకు పంపించడమే లక్ష్యంగా పెట్టుకు­న్నారు.

పైగా.. వైఎస్‌ జగన్‌ హయాంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహిస్తే.. పెద్దఎత్తున లిక్కర్‌ స్కాం జరుగుతోందని కూటమి పార్టీలు, ఎల్లో మీడియా సంస్థలు దుష్ప్రచారం చేశాయి. మరి ఇవాళ ములకల­చెరువులో భారీగా బయటపడ్డ నకిలీ మద్యం గురించి టీడీపీ కూటమి ప్రభు­త్వం, ఈ ఎల్లో మీడియా ఏం సమాధానం చెబు­తాయి? అప్పుడు మద్యం తాగినవాళ్లందరికీ లివర్లు, కిడ్నీలు పాడై­­పో­యాయని అన్నా­రుగా.. ఇప్పుడు పాడవవా? ఇక నిన్న అరెస్టైన సురేంద్రనాయుడు ఏ నాయకుడికి ముడుపులిస్తే ఈ దందా జరుగుతుందో సమాధానం చెప్పాలి.

ములకలచెరువులోనే ఐదేళ్లలో రూ.500 కోట్ల దందా..
ఇదిలా ఉంటే.. ఈ నకిలీ మద్యంతో కూడిన క్వార్టర్‌ బాటిల్‌ తయారీకి రూ.8   లేదా రూ.9 ఖర్చవుతుంది. అదే బాటిల్‌ను బెల్టుషాపుల వారికి రూ.110కి అమ్మితే వా­ళ్లు రూ.130కి అమ్ముతున్నారు. అంటే ఒక్కో బాటిల్‌ మీద రూ.100 ఆదాయం వస్తోంది. ఒక్క ములకలచెరువులో ఒక రోజులో 30 వేల బాటిళ్ల నకిలీ మద్యం తయారవుతుండగా రూ.30 లక్షల అక్రమార్జన జరుగుతోంది. ఇలా ఏడాదికి రూ.100 కోట్లు, ఐదేళ్లలో రూ.500 కోట్లు దండుకుంటున్నారు. ఇలా రాష్ట్రంలో ఇంకెన్ని చోట్ల నకిలీ మద్యం తయారుచేస్తున్నారో ప్రజలకు తెలియాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement