Sakshi News home page

తిరుమల భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి  18  గంటల సమయం

Published Fri, Jan 19 2024 7:54 AM

Rush Of Devotees In Tirumala Continues - Sakshi

తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వ దర్శనానికి అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి బయట క్యూలైన్లలో భక్తులు ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. సర్వదర్శనానికి  18  గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.

మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్‌ఎస్‌డి దర్శనం కోసం 14 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉండగా..  6 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(గురువారం) స్వామివారిని  62,649 భక్తులు దర్శించుకున్నారు. అందులో 24,384 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 3.74 కోట్లుగా లెక్క తేలింది.

Advertisement

What’s your opinion

Advertisement