బెంగళూరులో రూ.7 కోట్లు కొట్టేసిన దుండగులు.. చిత్తూరు జిల్లాలో వాహనం లభ్యం | Robbers In Bengaluru Pose As RBI Officers and Loot Crores From Cash Van, More Details | Sakshi
Sakshi News home page

బెంగళూరులో రూ.7 కోట్లు కొట్టేసిన దుండగులు.. చిత్తూరు జిల్లాలో వాహనం లభ్యం

Nov 21 2025 5:02 AM | Updated on Nov 21 2025 12:21 PM

Robbers In Bengaluru Pose As RBI Officers and Loot Crores From Cash Van

గుడిపాల మండలంలో దొరికిన ఇన్నోవా  

గుడిపాల: బెంగళూరులో ఏటీఎంలలో నగదు నింపే వాహనం నుంచి బుధవారం పట్టపగలే రూ.7.11 కోట్లు కొట్టేసిన ఆరుగురు దుండగులు డ­బ్బుతో పరారైన ఇన్నోవా వాహనం గురువారం చి­త్తూరు జిల్లాలో లభించింది. రిజర్వు బ్యాంకు, ఆదా­యపన్ను అధికారులమంటూ ఏటీఎంలకు నగదు తీసుకెళుతున్న వాహనాన్ని అడ్డగించి సిబ్బందిని దించేసి డ్రైవర్‌ను తీసుకెళ్లిన దుండగులు కొంతదూరం వెళ్లాక డ్రైవర్‌కు పిస్టల్‌ చూపించి కేంద్రప్రభుత్వ స్టిక్కర్‌ ఉన్న ఇన్నోవా వాహనంలోకి ఆ నగదును మార్చి పరారైన విషయం తెలిసిందే.

జీపీఎస్‌ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన కర్ణాటక పోలీసులు.. చెన్నై–బెంగళూరు రహదారిలోని చిత్తూరు జిల్లా గుడిపాల మండలం 190 రామాపురం చర్చివద్ద యుపి14–బిఎక్స్‌2500 నంబరుగల ఆ ఇన్నోవా వాహనం ఉన్నట్లు గుర్తించారు. ఇన్నోవాను అక్కడ ఆపేసిన దుండగులు డబ్బును మరో వాహనంలో తీసుకెళ్లినట్లు అను­మానిస్తున్నారు. ఇ­న్నోవా వాహనం బుధవారం రాత్రి 11 గంటల స­మయంలో గుడిపాల మండల కేంద్రం మీదుగా మండలంలోని చిత్తపార గ్రామానికి వెళ్లి కొంత సమయం తరువాత వెనక్కి వచ్చినట్టు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. దీంతో చిత్తపార గ్రామంలో ఎవరైనా అనుమానితులు ఉన్నారా అనే కోణంలో విచారిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement