పులస @ రూ.21 వేలు | Pulasa Fish Was Bought For Rs 21,000 At Mamidikuduru | Sakshi
Sakshi News home page

పులస @ రూ.21 వేలు 

Sep 21 2020 6:56 AM | Updated on Sep 21 2020 7:58 AM

Pulasa Fish Was Bought For Rs 21,000 At Mamidikuduru - Sakshi

పులసను దక్కించుకున్న ఏఎంసీ చైర్మన్‌ కొండలరావు

సాక్షి, మామిడికుదురు: భారతదేశంలో కేవలం గోదావరి జిల్లాల్లో మాత్రమే దొరికే అరుదైన పులస కోసం ప్రతి ఒక్కరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటారు. మాంసాహారులు లొట్టలేసుకుని తినే ఈ పులస స్టేటస్‌కు సింబల్‌గా నిలుస్తోంది. ఎంతో రుచికరమైన పులస చేప ఆదివారం వైనతేయ గోదావరి నదిలో పాశర్లపూడికి చెందిన మత్స్యకారుల వలకు చిక్కింది. భారీ డిమాండు ఉన్న ఈ పులస రెండున్నర కిలోల బరువుంది. దీనిని పాశర్లపూడి గ్రామానికి చెందిన వైఎస్సార్‌ సీపీ నేత, నగరం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కొమ్ముల కొండలరావు రూ.21 వేలు చెల్లించి సొంతం చేసుకున్నారు. (ఈ–పంట తరహాలో ఈ–ఫిష్‌)

Advertisement
 
Advertisement
Advertisement