రాష్ట్రపతికి సీఎం జగన్‌ ఘన స్వాగతం | President RamNath Kovind Reaches Renigunta Airport | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతికి సీఎం జగన్‌ ఘన స్వాగతం

Nov 24 2020 10:39 AM | Updated on Nov 24 2020 1:16 PM

President RamNath Kovind Reaches Renigunta Airport - Sakshi

సాక్షి, విజయవాడ : తిరుమల పర్యటన నిమిత్తం భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ గోవింద్‌ మంగళవారం ఉదయం ఆంధ్రప్రదేశ్‌కు చేరుకున్నారు. రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో ఆయనకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌ ఘన స్వాగతం పలికారు.  ఎయిర్‌పోర్టు నుండి రోడ్డు మార్గంలో  తిరుచానూరు చేరుకుని శ్రీ పద్మావతి అమ్మవారిని రాష్ట్రపతి దంపతులు దర్శించుకుంటారు. అనంతరం 12.15 గంటలకు తిరుమల చేరుకుంటారు. శ్రీవారి దర్శనానంతరం 4.50 గంటలకు రేణిగుంట చేరుకుని, అక్కడి నుంచి అహ్మదాబాద్‌కు వెళతారు.


 





(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Advertisement
 
Advertisement
Advertisement