Madanapalle: మదనపల్లె: తెల్లారితే పెళ్లి.. వరుడికి షాక్‌

Madanapalle: Bride Disappears Groom Complaint To Police - Sakshi

సాక్షి, చిత్తూరు: తెల్లవారితే పెళ్లి పీటలెక్కాల్సిన వధువు అర్ధరాత్రి అదృశ్యమైంది. దీంతో పెళ్లికుమారుడు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన మదనపల్లెలో చోటుచేసుకుంది. వివరాలు..  అనంతపురం జిల్లా నంబర్ పూలుకుంట మండలం కమ్మలవారి బురుజుకు చెందిన రామాంజనేయులు(23)కు, తంబళ్లపల్లి మండలం బురుజుపల్లికి చెందిన కుమారి (19) కి ఇటీవల పెద్దలు వివాహం కుదిర్చారు. బుధవారం పెళ్లి జరిపించాలని నిర్ణయించారు. 

ఈ క్రమంలో మంగళవారం రాత్రి వధూవరులు, బంధువులు మదనపల్లెలోని కళ్యాణం చేరుకున్నారు. అయితే, అర్ధరాత్రి పెళ్లి కూతురు అదృశ్యమైనట్లు గుర్తించిన వరుడు షాక్‌కు గురయ్యాడు. తల్లిదండ్రులతో కలిసి మదనపల్లె పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.

చదవండి: అమరరాజా ఆటకట్టు..

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top