ప్రత్యేక లోక్‌ అదాలత్‌లో భారీగా కేసులు పరిష్కారం | A large number of cases were resolved in the Special Lok Adalat | Sakshi
Sakshi News home page

ప్రత్యేక లోక్‌ అదాలత్‌లో భారీగా కేసులు పరిష్కారం

Jul 19 2026 2:53 AM | Updated on Jul 19 2026 2:53 AM

A large number of cases were resolved in the Special Lok Adalat

692 చెక్‌ బౌన్స్‌ కేసులు పరిష్కారం..  

రూ.24.27 కోట్ల పరిహారం చెల్లింపు 

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా శనివారం నిర్వహించిన ప్రత్యేక లోక్‌ అదాలత్‌లో పెద్ద సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యాయి. రాష్ట్ర న్యాయ సేవాధికా­ర సంస్థ ఆధ్వర్యంలో చెక్‌ బౌన్స్‌ కేసుల త్వరిత పరిష్కారం కోసం ఈ ప్రత్యేక లోక్‌ అదాలత్‌ను నిర్వహించారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 692 కేసు­లు పరిష్కారమయ్యాయి. పరిహారం కింద రూ.­24.27 కోట్ల చెల్లింపులు జరిగాయి. హైకోర్టు ప్రధా­న న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ ప్యాట్రన్‌ ఇన్‌ చీఫ్‌ జస్టిస్‌ లీసా గిల్‌ ఆదేశాల మేరకు ఈ ప్రత్యేక లోక్‌ అదాలత్‌ చేపట్టారు. 

ఈ కార్యక్రమానికి రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షులు న్యాయమూర్తి జస్టిస్‌ రవి నాథ్‌ తిల్హరి, హైకోర్టు న్యా­య సేవల కమిటీ చైర్మన్‌ న్యాయ­మూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ సంయుక్తంగా మార్గనిర్దేశం చేశారు. హైకో­ర్టులో 9 కేసుల పరిష్కారమయ్యాయి. పరిహారం కింద రూ.49.10 లక్షలు చెల్లించారు. హైకోర్టులో లోక్‌ అదా­లత్‌ నిమిత్తం రెండు ప్రత్యేక బెంచ్‌ల­ను ఏర్పా­టు చేశారు. 

మొదటి బెంచ్‌కు న్యాయ­మూర్తి జస్టిస్‌ కె. శ్రీనివాస రెడ్డి, రెండవ బెంచ్‌కు న్యాయ­మూర్తి జస్టిస్‌ కిరణ్మయి మండవ అధ్యక్షత వహించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్నీ జిల్లాల్లో 207 బెంచ్‌లు ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక లోక్‌ అదాలత్‌ విజయవంతం కావడానికి సహకరించిన న్యాయవాదులు, కక్షి­దారులు, సిబ్బందికి న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి హిమబిందు, న్యాయ సేవల కమిటీ కార్యదర్శి మాలతి, న్యాయసేవాధికార సంస్థ డిప్యూ­టీ సెక్రటరీ అమర రంగేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement