సాక్షి, విజయవాడ: ఏపీలో కాస్ట్ కటింగ్పై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేక విమాన ప్రయాణాలను నియంత్రించని ప్రభుత్వం.. కేవలం అధికారులు, ఉద్యోగులకే పొదుపు పాఠాలు చెబుతోంది. అనవసర ఖర్చులు, ఇంథన పొదుపు, వర్చువల్ గవర్నెన్స్, వర్క్ ఫ్రం హోమ్ పై ఆదేశాలు జారీ చేసింది. అన్ని శాఖల ఉన్నతాధికారులు, కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది.
50 శాతం అధికారిక సమీక్షలు వీడియో కాన్ఫరెన్స్లలో చేయాలన్న ప్రభుత్వం.. మీటింగ్లు, సమీక్షల కోసం అనవసర ప్రయాణాలు తగ్గించాలని ఆదేశాలు జారీ చేసింది. అన్ని శాఖల్లోని అధికారులు ఎలక్ట్రానిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలని, అనవసరంగా మంత్రులు, అధికారులు విదేశీ ప్రయాణాలు చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ కార్యాలయాల్లో లైట్ల వినియోగం తగ్గించాలని ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వం.. డెకరేటివ్ లైటింగ్స్, జనరేటర్ల వినియోగం తగ్గించాలని పేర్కొంది.


