AP: పలువురు డీఎస్పీలు, సీఐలను నియమించిన ఈసీ | Ec Appointed New Dsps In Andhra pradesh | Sakshi
Sakshi News home page

AP: పలువురు డీఎస్పీలు, సీఐలను నియమించిన ఈసీ

May 20 2024 3:41 PM | Updated on May 20 2024 4:15 PM

Ec Appointed New Dsps In Andhra pradesh

సాక్షి,విజయవాడ: ఏపీలో ఇటీవల సస్పెండ్‌ చేసిన పలువురు పోలీసుల స్థానంలో కొత్త వారిని ఎన్నికల కమిషన్‌(ఈసీ) నియమించింది. నరసరావుపేట డీఎస్పీగా ఎం. సుధాకర్ రావు,  గురజాల డీఎస్పీగా సిహెచ్ శ్రీనివాసరావులకు పోస్టింగ్‌  ఇచ్చింది.

పల్నాడు ఎస్బీ సీఐ1గా బండారు సురేష్ బాబు, ఎస్బీ సీఐ2గా యు శోభనన్‌బాబు,  కారంపూడి ఎస్సైగా కె.అమీర్‌, నాగార్జునసాగర్ ఎస్ఐగా ఎం.పట్టాభిని నియమిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. 

కాగా, ఇటీవల పోలింగ్‌ ముగిసిన తర్వాత రాష్ట్రంలో పలు చోట్ల హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఈ ఘర్షణలకు ఆయా ప్రాంతాల్లోని పలువురు పోలీసులను బాధ్యులను చేస్తూ ఈసీ వారిని సస్పెండ్‌ చేసింది. అనంతరం వారి స్థానంలో కొత్త వారిని నియమిస్తోంది.  

సస్పెండ్ అయి స్థానంలో కొత్త అధికారులు

Advertisement
 
Advertisement
Advertisement