తూర్పుగోదావరి: కరోనా సోకి డాక్టర్‌ సతీష్‌ కుమార్‌ మృతి

East Godavari: Doctor Died Due To Covid - Sakshi

5రోజుల క్రితం ఆసుపత్రిలో చేరిన డాక్టర్‌

సాక్షి, తూర్పుగోదావరి: జగ్గంపేట కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో దంత వైద్యుడిగా పనిచేస్తున్న ముప్పన సతీష్‌కుమార్‌ (45) బుధవారం సాయంత్రం రాజమండ్రిలో ఒక ప్రయివేట్‌ ఆసుపత్రిలో మృతి చెందారు. సీహెచ్‌సీ సిబ్బంది సమాచారం మేరకు ఐదు రోజుల క్రితం కరోనా లక్షణాలతో సతీష్‌కుమార్‌ రాజమండ్రిలోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేరారు. బుధవారం ఉదయం నుంచి ఆరోగ్యం విషమించింది. సాయింత్రం 4గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్త తెలియగానే  వెంటనే జగ్గంపేట సీహెచ్‌సీలో విషాదం నెలకొంది. కొంతమంది వైద్యులు,సిబ్బంది రాజమండ్రి బయలుదేరి వెళ్లారు. సతీష్‌ కుమార్‌  రెండు సంవత్సరాలుగా జగ్గంపేటలో  పనిచేస్తున్నారు. ఆయన స్వగ్రామం పెద్దాపురం. 

కరోనాతో మహిళ మృతి.. 
సఖినేటిపల్లి: మండల పరిధిలోని ఉయ్యూరువారి మెరకలో బుధవారం 55 ఏళ్ల మహిళ కరోనాతో మృతి చెందింది. ఈ విషయాన్ని మోరి పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ ప్రతిమ చెప్పారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top