విజయనగరంలో డయేరియా కలకలం.. 11కు చేరిన మరణాలు | Diarrhea Outbreak In AP Vizianagaram, Over 200 Cases And 11 Deaths Registered | Sakshi
Sakshi News home page

Diarrhea Cases In AP: విజయనగరంలో డయేరియా కలకలం.. 11కు చేరిన మరణాలు

Oct 19 2024 10:17 AM | Updated on Oct 19 2024 11:26 AM

Diarrhea Deaths Increased At Vizianagaram District

సాక్షి, విజయనగరం: ఏపీలో డయేరియా బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. విజయనగరం జిల్లాలో డయేరియా విజృంభిస్తోంది. తాజాగా మరో ఇద్దరు మృతిచెందడంతో మృతుల సంఖ్య 11కు చేరుకుంది.

తాజాగా విజయనగరంలోని గుర్ల మండలం నాగళ్లవలసలో డయేరియాతో ఇద్దరు మృతి చెందారు. దీంతో, జిల్లాలో డయేరియా మృతుల సంఖ్య 11కు చేరింది. ఇక, మరో 200 మందికిపైగా బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. డయేరియా కారణంగా గుర్ల, గరివిడి, చీపురుపల్లి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 


 

Advertisement
 
Advertisement
Advertisement