ఏపీ: గత 24 గంటల్లో 6,141 కరోనా కేసులు

Corona In AP: New 6151 Cases Reported In A Day - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,02,712 మంది సాంపిల్స్‌ పరిశీలించగా.. 6,151 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1,83,29,021కు చేరుకుంది. బుధవారం 58 మంది మృత్యువాపడగా.. మొత్తంగా మరణాల సంఖ్య 12,167కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కరోనాపై గురువారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

ఇక కరోనా నుంచి ఒక్కరోజులో 7,728 మంది కోలుకోగా.. ఇప్పటివరకు డిశ్చార్జి అయినవారి సంఖ్య 17,50,904గా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 69,831 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇక ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా  2,08,39,147 సాంపిల్స్‌ని పరీక్షించినట్లు అధికారులు పేర్కొన్నారు.

చదవండి: ఆ.. ఐదు రాష్ట్రాల్లోనే కరోనా తీవ్రత

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top