కొనసాగుతున్న చలి తీవ్రత | Cold weather Continued in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న చలి తీవ్రత

Jan 11 2023 3:25 AM | Updated on Jan 11 2023 3:25 AM

Cold weather Continued in Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతోంది. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూనే ఉన్నాయి. మంచుతోపాటు పొగమంచు కురు­స్తోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా అర­కులో మంగళవారం తెల్లవారుజామున 3.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. జి.మాడు­గుల మండలం కుంతలంలో 4.1, చింతపల్లి మండలం చింతపల్లిలో 4.2, జీకే వీధిలో 4.3, డుంబ్రిగూడలో 4.4, జి.మాడుగుల, హకీంపేటలో 4.7, పాడేరులో 5 డిగ్రీల కనిష్ట ఉష్ణో­గ్రతలు నమోదయ్యాయి.

ఏజెన్సీలోని చాలా­ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 8 డిగ్రీల కన్నా తక్కువగా నమోదయ్యాయి. రాయలసీమ­లోని పలు ప్రాంతాల్లోనూ విశాఖ ఏజెన్సీ తర­హాలో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు నమోద­వడం విశేషం. శ్రీసత్యసాయి జిల్లా ఆగలిలో 7.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అదే జిల్లా మడకశిర మండలం ఆర్‌.అనంతపురం, అనంతపురం జిల్లా బెళుగుప్పలో 8.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement